యాప్నగరం

శబరిమలలో హరివరాసనం తొలిసారిగా పాడిందెవరు?

శబరిమల అయ్యప్ప స్వామి పవళింపు సందర్భంగా పాడే పాట వింటే మదిలో ఆనందం తాండవిస్తుంది. అయ్యప్ప భక్తులు హరివరాసనం పేరుతో పిలుచుకునే ఈ పాట ఎంతో మధురంగా ఉంటుంది.

TNN 21 Nov 2017, 3:16 pm
శబరిమల అయ్యప్ప స్వామి పవళింపు సందర్భంగా పాడే పాట వింటే మదిలో ఆనందం తాండవిస్తుంది. అయ్యప్ప భక్తులు హరివరాసనం పేరుతో పిలుచుకునే ఈ పాట ఎంతో మధురంగా ఉంటుంది. శబరిగిరీశుడి సన్నిదానంలో ఈ పాట వింటే తన్మయత్వంలో పులకించుపోతారు. ఇంతకి ఆ పాట ఎలా పుట్టింది..? ఎవరు రచించారు…? ఎవరు పాడారు..? అయ్యప్ప పూజలు చేసిన తర్వాత చివరగా ఈ పాటను పాడటం ఒక సంప్రదాయం. 1920లో కొనకథు జానకి అమ్మ అనే మహిళ రచించారని కొందరు, కుంభకుడి కులత్తూర్ అయ్యర్ రచించారని ఇంకొందరు అంటారు. అయితే 1955లో స్వామి విమోచననంద అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారు.
Samayam Telugu ayyappa swamys harivarasanam song history and its importance
శబరిమలలో హరివరాసనం తొలిసారిగా పాడిందెవరు?


1950 వ దశకంలో శబరిమల నిర్మాణుష్యంగా ఉండేది. ఆ కాలంలో వీఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు స్వామి వారి ఆలయ సమీపంలో నివశిస్తూ ఉండేవాడు. స్వామివారికి ప్రత్యేక పూజలప్పుడు హరివరాసనాన్ని పారాయణం చేసేవాడు. అప్పట్లో ఈశ్వర్ నంభూద్రి ఆలయానికి తాంత్రిగా (పూజారి) ఉండేవారు. తర్వాత గోపాలమీనన్ శబరిమల నుంచి వెళ్లిపోయాడు. ఆయన మరణ వార్తను తెలుసుకుని తీవ్రంగా దుఃఖించిన ఈశ్వర్ నంభూద్రి ఆ రోజు ఆలయం మూసే సమయంలో హరివరాసనం స్తోత్రం పటించాడు. అప్పటి నుంచి శబరిమలలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది.

హరివరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క దీపం మాత్రం ఉంచుతారు. ఇది స్వామివారికి నిద్రపోయేముందు జోల పాట లాంటిది. హరివరాసనం పూర్తయిన తరువాత నమస్కారం చేయవద్దని, స్వామి శరణు అని చెప్పుకోవద్దని అంటారు. ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి.మరోసారి ఈ పాటను రీ రికార్డింగ్ చేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డ్ సన్నద్ధమైంది. ప్రస్తుతం ఆలయంలో వినిపిస్తోన్న ఈ పాటను ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాసు ఆలపించిందే. ఆయన ఇతర మతానికి చెందిన వారైనా అయ్యప్ప స్వామి సన్నిధిలో కచేరీలు నిర్వహించి, శబరిగిరీశుడి పట్ల తనుకున్న భక్తిని అలా చాటుకుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.