యాప్నగరం

‘నా సోదరి శబరిమల వెళ్లిందా.. దీని వెనుక కుట్ర ఉంది’

బుధవారం తెల్లవారుజామున పోలీసుల భద్రత నడుమ పదునెట్టాంబడి మీదుగా సన్నిధానంలోకి ప్రవేశించిన కోజికోడ్ మహిళలు బిందు, కనకదుర్గ బయటకు వచ్చిన తర్వాత పూజారులు వినూత్న నిరసన చేపట్టారు.

Samayam Telugu 2 Jan 2019, 1:42 pm
బుధవారం తెల్లవారుజామున శబరిమల ఆలయంలోకి నిషేధిత వయసున్న ఇద్దరు మహిళలు ప్రవేశించడంతో మరోసారి కేరళలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. కోజికోడ్‌కు చెందిన ఇద్దరు మహిళలు సన్నిధానంలోకి ప్రవేశించి స్వామిని దర్శించుకున్న తరువాత ఆలయ తలుపులను మూసివేసిన పూజారులు, సంప్రోక్షణ తరువాత తిరిగి మళ్లీ తెరిచారు. ప్రధాన అర్చకుడి ఆదేశాలతో ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరంభక్తులను దర్శనానికి అనుమతిస్తున్నామని, ఇప్పుడు పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు. అంతకుముందు ఆలయ నిర్వాహకులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, సంప్రోక్షణకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, శబరిమలలో చోటుచేసుకున్న ఘటనలపై వందల రాజవంశీకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయ్యప్ప ఆలయ సంప్రదాయాలను మార్చేందుకు తాము మద్దతివ్వబోమని స్పష్టం చేశారు.
Samayam Telugu sabarimalajpeg


కాగా, ఆలయంలోకి ప్రవేశించిన కేరళ పౌరసరఫరాల శాఖ ఉద్యోగిని కనకదుర్గ సోదరుడు భిన్నంగా స్పందించాడు. ‘హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ, అయ్యప్పను కొలిచే తమ కుటుంబంలోని మహిళ, శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకుందంటే నమ్మలేకున్నానని’ అతడు వ్యాఖ్యానించారు. కోజికోడ్‌లో కనకదుర్గ ఇంటి ముందు పలువురు నిరసనకు దిగగా, ఆయన మాట్లాడారు. తన సోదరి అయ్యప్పను దర్శించుకుందంటే నమ్మలేకున్నానని, దీని వెనుక బలమైన కుట్రే ఉందని పేర్కొన్నారు. తన సోదరిని భయపెట్టి ఆలయానికి తీసుకెళ్లి ఉంటారని, ప్రస్తుతం ఆమె ఆచూకీ తమకు తెలియడం లేదని అన్నారు. కనకదుర్గ ప్రాణాలకు ముప్పు ఉందన్న ఆందోళన తమ కుటుంబంలో నెలకొనివుందని వాపోయాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.