యాప్నగరం

Sabarimala: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం నేడే.. కేరళలో హై టెన్షన్!

శబరిమల అయ్యప్ప సన్నిధానం నేడు తెరుచుకోనుంది. మహిళలకు కూడా ఆలయ ప్రవేశం కల్పించాలన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో.. దేశం దృష్టి మొత్తం కేరళపై కేంద్రీకృతమైంది. ఈ రోజు కేరళలో ఏం జరుగుతుందోనని జనం ఆందోళన చెందుతున్నారు.

Samayam Telugu 17 Oct 2018, 9:34 am
మాస పూజల కోసం శబరిమల అయ్యప్ప సన్నిధానం నేటి సాయంత్రం (బుధవారం) తెరుచుకోనుంది. మహిళలకు కూడా ఆలయ ప్రవేశం కల్పించాలని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించాక.. తొలిసారి ఆలయాన్ని తెరుస్తున్నారు. దీంతో కేరళలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మహిళలకు ఆలయ ప్రవేశం విషయమై అత్యున్నత ధర్మాసనం తీర్పును పాటిస్తామని కేరళ సర్కారు చెప్పగా.. మరోవైపు సుప్రీం తీర్పుపై అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తూ కేరళ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు
Samayam Telugu ayyappa temple


సుప్రీం తీర్పు ప్రకారం 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు ఆలయ ప్రవేశం చేస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భారతీయ ధర్మ జనసేన, శబరిమల భక్త సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో శబరిమల పరిసరాల్లో హింస చోటు చేసుకునే ప్రమాదం ఉందని భయపడుతున్నారు.

శబరిమలకు వచ్చే వాహనాలను నిలిపి ఉంచే నీలక్కల్‌‌కు ఇప్పటికే వేలాది మంది ఆందోళనకారులు చేరుకున్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి ఒక్క మహిళను కూడా శబరిమల వైపు వెళ్లనిచ్చేది లేదని వారు తేల్చి చెబుతున్నారు. ఎవరైనా వస్తే, తాము రోడ్డుపై పడుకుని అడ్డుకుంటామని, అప్పటికీ వెనుదిరగకపోతే వారిని రెండు ముక్కలు చేస్తామని ఘాటుగా హెచ్చరిస్తున్నారు.

సుప్రీం తీర్పును అమలు చేస్తే.. నిత్యం ఆలయ శుద్ధి ప్రక్రియ అయిన పుణ్యాహ వచనం చేయాల్సి ఉంటుంది. ఇది సాధ్యం కాదు, కాబట్టి.. ఆలయాన్ని నిరవధికంగా మూసేయాలని పూజారులు, రాజకుటుంబీకులు భావిస్తున్నారు. ఆలయంలోకి మహిళలు ప్రవేశిస్తే.. పూజలు చేయబోమని పూజారులు హెచ్చరిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.