యాప్నగరం

‘మా ప్రభుత్వాన్ని కూల్చేంత శక్తి అమిత్ షాకు లేదు’

అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును అమలుచేస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించడం, దీనిని బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యతిరేకించడం తెలిసిందే.

Samayam Telugu 29 Oct 2018, 2:05 pm
సుప్రీంతీర్పుతో శబరిమల ఆలయం చుట్టూ ఇప్పుడు రాజకీయ వివాదం నెలకొంది. అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును అమలుచేస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటించడం, దీనిని బీజేపీ, కాంగ్రెస్‌లు వ్యతిరేకించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం కేరళ సీఎం విజయన్‌ను ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శబరిమలకు మద్దతుగా ఉంటామని, ఒకవేళ భక్తుల మనోభావాలు దెబ్బతియడానికి కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తే, దాన్ని పడగొట్టడానికి కూడా సిద్ధమేనని షా హెచ్చరించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయ్ విజయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ... నిషేధిత మహిళలు ప్రవేశించవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పును అమిత్ షా వ్యతిరేకిస్తున్నారని సీఎం దుయ్యబట్టారు.
Samayam Telugu kerala


శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళలపై బీజేపీ, ఆరెస్సెస్ శ్రేణులు దాడికి తెగబడ్డాయని ఆయన ఆరోపించారు. సర్వోన్నత న్యాయస్థానానే బెదిరించేందుకు అమిత్ షాకు ఎన్ని గుండెలు? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే తమక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అమిత్ షా కుట్రలు చేస్తున్నారని, అయితే, ఆయనకున్న బలం దానికి సరిపోదని విజయన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు ఆయన శరీరమంతా నీటితోనే నిండిపోయిందని, వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆయనకు లేదని, ఇలాంటివి గుజరాత్‌లో కుదురుతాయి తప్ప ఇక్కడ కాదని హితవు పలికారు.

కేరళలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అమిత్ షా పగటి కలలు కంటున్నారని, రాష్ట్రంలో అడుగు పెట్టేంత స్థలం కూడా లేదని, బీజేపీకి ఇక్కడ స్థానం ఉండబోదని పేర్కొన్నారు. అలాగే భారీ అంచనాలతో యాత్ర చేపట్టిన అమిత్ షా, తర్వాత పారిపోయారని విజయన్ ఎద్దేవా చేశారు.

మరోవైపు కేరళ బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై మాట్లాడుతూ.. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని అన్నారు. ప్రభుత్వం కూల్చేస్తామని అమిత్ షా అనలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. శబరిమలలో మహిళలను అడ్డుకున్న భక్తులు, ఆందోళనలో పాల్గొన్నవారిపై కేరళ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కేసులు నమోదుచేసింది. దాదాపు 3 వేల మందిని అరెస్ట్ చేసి, శాంతియుతంగా నిరసన చేసినవారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.