యాప్నగరం

శబరిమల ఆలయ బోర్డు కీలక నిర్ణయం

శబరిమల ఆలయంలోకి మహిళల అనుమతిపై కేరళ ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 19 Oct 2018, 9:38 pm
యసుతో నిమిత్తం లేకుండా మహిళలంతా శబరిమల ఆలయంలోకి ప్రవేశించి అయప్ప స్వామిని దర్శించుకోవచ్చంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆలయ బోర్డు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ట్రావన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) నిర్ణయించింది.
Samayam Telugu adf


సుప్రీం నిర్ణయాన్ని మహిళా భక్తులు సైతం వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆలయం తెరిచిన రోజు నుంచి శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన భక్తులను ఆందోళనకారులు అడుగడుగునా అడ్డగించారు. హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయురాలు పోలీసుల రక్షణ మధ్య ఆలయానికి వెళ్లినా.. అక్కడ పెద్ద సంఖ్యలో చిన్నారులు, వృద్ధులు అడ్డగించడంతో అయప్ప స్వామిని దర్శించుకోకుండానే వెనుతిరిగింది. అయితే, శబరిమలలో రాజుకున్న ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారే పరిస్థితి కనిపించని నేపథ్యంలో టీడీబీ సుప్రీంలో రివ్యూ పిటీషన్ వేయాలని నిర్ణయించింది. ఇందుకు పందళ రాజవంశీయులు, మత సంస్థలు కూడా అంగీకరించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.