యాప్నగరం

రుతుస్రావ రక్తంతో తడిచిన శానిటరీ న్యాప్‌కిన్‌ను..: శబరిమల వివాదంపై స్మృతి స్పందన

శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళ ప్రవేశం అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నేపథ్యంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ విషయమై స్పందించారు.

Samayam Telugu 23 Oct 2018, 3:16 pm
శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం అంశం వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఈ విషయమై స్పందించారు. అందరికీ ప్రార్థించే హక్కు ఉంటుంది. కానీ అపవిత్రం చేసే హక్కు ఉండదని ఆమె తెలిపారు. ‘నేను బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి సుప్రీం కోర్టు తీర్పు గురించి మాట్లాడలేను. ప్రార్థించే హక్కు ఉంటుంది, అపవిత్రం చేసే హక్కు ఉండదని నేను నమ్ముతున్నా’ అని ముంబైలో జరిగిన యంగ్ థింకర్స్ కాన్ఫరెన్స్‌లో సోమవారం స్మృతి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Samayam Telugu smriti irani


‘రుతుస్రావ రక్తంతో కూడిన శానిటరీ నాప్‌కిన్స్‌ను మీ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్తారా? అలా చేయరు కదా. దేవుడి ఇంటికి అలా వెళ్లడం గౌరవం అనుకుంటున్నారా? నాకు ప్రార్థించే హక్కు ఉంది, కానీ గుడిని అపవిత్రం చేసే హక్కు లేద’ని మంత్రి తెలిపారు.

‘మా పిల్లలు జోరాస్ట్రియన్లు, వాళ్లిద్దరూ అగ్ని దేవాలయానికి వెళ్లి పూజిస్తారు. నా చిన్న కొడుకును అగ్ని దేవాలయానికి తీసుకెళ్లినప్పుడు నేను గుడికి దూరంగా నిలబడ్డాను. రోడ్డు బయటే నిల్చొని ప్రార్థించాన’ని స్మృతి చెప్పారు.

పది నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీలు శబరిమల ఆలయంలోకి వెళ్లడంపై శతాబ్దాలుగా నిషేధం ఉంది. కాగా, అన్ని వయసుల మహిళలు అయ్యప్ప ఆలయానికి వెళ్లొచ్చంటూ సుప్రీం కోర్టు గత నెలలో తీర్పునిచ్చింది. కానీ భక్తులు, పూజారులు అడ్డుకోవడంతో ఐదు రోజులపాటు గుడి తెరిచినా.. నిషేధిత వయసున్న ఏ ఒక్క మహిళా గుళ్లోకి వెళ్లలేకపోయారు. పోలీసుల భద్రత మధ్య కొచ్చికి చెందిన రెహానా ఫాతిమా, హైదరాబాద్ రిపోర్టర్ కవిత ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ.. పూజారుల హెచ్చరికల నేపథ్యం, కేరళ సర్కారు సూచనలతో వెనక్కి తగ్గారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.