యాప్నగరం

శబరిమల ఆలయ విషయంలో కేరళ ప్రభుత్వానికి సుప్రీం కీలక ఆదేశాలు

శబరిమలలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలకూ ప్రవేశం కల్పించాలన్న గతేడాది సుప్రీంకోర్టు తీర్పును కేరళ ప్రభుత్వం అమలుచేయడంతో అయ్యప్ప భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు.

Samayam Telugu 21 Nov 2019, 1:10 pm
శబరిమల అయ్యప్ప ఆలయం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కీలక ఆదేశాలు వెలువరించింది. అయ్యప్ప ఆలయ నిర్వహణపై ప్రత్యేక చట్టం చేయాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆలయాన్ని సందర్శించే భక్తుల సంక్షేమం సహా అన్ని అంశాలతో చట్టాన్ని రూపొందించి జనవరి మూడో వారంలోగా తమకు అందజేయాలని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. అయితే, శబరిమల విషయంలో గతేడాది సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. శబరిమల రివ్యూ పిటిషన్లపై జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం గతవారం విస్తృత ధర్మాసనం ధర్మాసనానికి బదిలీచేసిన విషయం తెలిసిందే.
Samayam Telugu sc


ఆలయాలు, వాటి నిర్వహణకు సంబంధించిన చట్టానికి సవరణలు ప్రతిపాదించామని, దాని ప్రకారం ఆలయ సలహా మండళ్లలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ముసాయిదాలో పొందుపరిచినట్టు కేరళ ప్రభుత్వం తరఫు లాయర్ చెప్పారు. ప్రస్తుతానికి 50 ఏళ్లు దాటిన మహిళలకు సలహా మండళ్లలో ప్రాతినిధ్యం కల్పించనున్నట్టు తెలిపారు.

శబరిమల ఆలయానికి కొత్త చట్టాన్ని రూపొందించాలని ఆగస్టు 27న కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం కోరింది. అయితే, ట్రావెన్‌కోర్-కొచ్చిన్ హిందూ మత సంస్థల చట్టంలో ముసాయిదా సవరణలను కేరళ రూపొందించింది. ఇది సరిపోదని, శబరిమల ఆలయ పరిపాలన కోసం ప్రత్యేకమైన చట్టం అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పందళం రాజవంశం దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. అయ్యప్ప ఆలయం, సమీపంలోని మసీదు నిర్వహణపై తొలిసారిగా 2006లో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.