యాప్నగరం

Ayyappa Swami Irumudi అయ్యప్ప స్వామి ఇరుముడిలో ఉన్న ఆంతర్యాలేంటో తెలుసుకుందామా...

Ayyappa Swami Irumudi అయ్యప్ప మాల వేసుకున్న వారంతా తమ దీక్షలో భాగంగా ఇరుముడి కట్టుకుంటారు. మండల దీక్ష పూర్తయ్యే నాటికి శబరిమలకు చేరుకుంటారు. అక్కడ ఎవరైతే ఇరుముడితో వస్తారో వారికి మాత్రమే స్వామి వారి 18 సోపానాల(మెట్ల) మార్గంలో వెళ్లేందుకు అనుమతిస్తారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాల ధరించిన వారు ఇరుముడిని ఎందుకు కట్టుకుంటారు.. అందులో ఏముంటాయి.. అసలు ఇరుముడి అంటే ఏమిటి.. వాటి ప్రాముఖ్యతలేంటనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 28 Nov 2022, 4:29 pm
Ayyappa Swami Irumudi కేరళ రాష్ట్రంలోని శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయం తెరచుకున్నప్పటి నుంచి అయ్యప్ప స్వామి భక్తులతో శబరిగిరులన్నీ మణికంఠుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. మండల దీక్షలో భాగంగా కటిక నేలపై నిద్రించడం.. రెండు పూటలా చల్లని నీటితో స్నానం.. కేవలం నల్లని వస్త్రాలనే ధరించడం.. సాత్విక ఆహారాన్నే తీసుకుంటారు అయ్యప్పస్వామి భక్తులు. కార్తీక మాసం ప్రారంభం నుంచి మకర సంక్రాంతి పూర్తయ్యే వరకు అయ్యప్ప స్వాముల దర్శనం శబరిమలలో నిరంతరం కొనసాగుతుంది. అయితే దీక్ష ముగించే వేళ ఇరుముడిని తప్పనిసరిగా ధరిస్తారు. స్వామి సన్నిధిని చేరుకున్నాకే ఇరుముడిని విప్పుతారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు ఇరుముడిని ఎందుకని ప్రత్యేకంగా రూపొందిస్తారు.. ఇరుముడితో ఉన్న స్వాములనే 18 మెట్ల ద్వారా వెళ్లేందుకు ఎందుకని అనుమతిస్తారనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu what is ayyappa irumudi and how to make irumudi and significance in telugu
Ayyappa Swami Irumudi అయ్యప్ప స్వామి ఇరుముడిలో ఉన్న ఆంతర్యాలేంటో తెలుసుకుందామా...


​ఇరుముడి ఎందుకంటే..

మండల దీక్ష పూర్తయిన అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముడిని ధరించి మణికంఠుని దర్శనానికి బయలుదేరుతారు. ఇందులో భాగంగానే ఇరుముడిని తప్పనిసరిగా తీసుకెళ్తారు. ఇరుముడిలోని తొలి భాగంలో కొబ్బరికాయలోని నీటిని తొలగించి, పూర్తిగా నెయ్యితో నింపుతారు. అలాగే పూజా సామాగ్రి పెడతారు. రెండో భాగంలో స్వాముల వారి ప్రయాణానికి కావాల్సిన బియ్యం పప్పు, పసుపు, కుంకుమ, రవికలను పెడతారు.

god idols at home ఇంట్లో ఇలాంటి దేవుని విగ్రహాలు లేదా ఫోటోలు ఉండకూడదా... ఎలాంటి ఫోటోలు పెట్టుకోవాలంటే..

​రెండో భాగంలో..

‘భక్తి’, ‘శద్ధ’అనే రెండు భాగాలు కలిగిన ఇరుముడిలో భక్తి అనే భాగంలో కొబ్బరికాయ ముద్ర సంచిని ఉంచి, శ్రద్ధ అనే రెండ భాగంలో తాత్కాలికంగా వాడే ఆహార పదార్థాలను ఉంచుతారు. భక్తి శ్రద్ధలు ఎక్కడుంటాయో.. అక్కడ ఓంకారం ఉంటుందని.. అందుకు నిదర్శనంగానే ఇరుముడిని ఓంకారమనే తాడుతో బిగిస్తారు.

​అయ్యప్ప పాదాలకు చేరుతుందని..

శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులలో కన్నె స్వాములు, గురు స్వాములు ఇరుముడితో 18 మెట్ల మీదుగా వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. ఈ సమయంలో ఆ ఇరుముడి అయ్యప్ప పాదాల వద్దకు చేరుకుంటుందని.. దీని వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ఇరుముడిని కట్టుకునేటప్పుడు, ఇరుముడి తీసేటప్పుడు విధిగా అయ్యప్ప స్వామిని స్మరించుకున్న వారికి శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు.

​ఇరుముడిలోని ఆంతర్యం ఏంటంటే..

జీవుని ఆత్మ, పరమాత్మలను అనుసంధానం చేయడమే ఇరుముడిలోని ఆంతర్యం అని పండితులు చెబుతారు. దీక్ష విరమించిన స్వాములు తమ వ్యక్తిత్వంలో, అలవాట్లలో వచ్చిన మార్పులనే కొనసాగించాలి. ఒకవేళ అలా చేయకపోతే తాము ధరించిన మాలకు సార్థకం లేనట్టేనని పండితులు చెబుతున్నారు. అయ్యప్ప దీక్ష ప్రారంభించడానికి కనీసం వారం రోజులు ముందే మద్యం, మాంసం వంటి వాటి జోలికి వెళ్లకూడదు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.