యాప్నగరం

Ayyappa Devotees అయ్యప్ప దీక్షలో ఉండే స్వాములు నల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారంటే...

Ayyappa Devotees కేరళలోని శబరిగిరుల్లో మణికంఠుని దర్శనం కోసం వెళ్లే భక్తులలో ఎక్కువ మంది నల్లని దుస్తులనే ధరిస్తూ ఉంటారు. నల్లని ధోతీ, నలుపు రంగులో ఉండే ప్యాంటు, చొక్కాలనే ధరించి వెళ్తుంటారు. మరికొందరు కుంకుమపువ్వు రంగు దుస్తులను ధరించి వెళ్తుంటారు. అంతేకాదు అయ్యప్పస్వామి దర్శనానికి 18 మెట్లను ఎక్కాలంటే నల్లని దుస్తుల ధరించిన వారికే అనుమతి లభిస్తుంది. ఈ సందర్భంగా అయ్యప్ప మాలను వేసుకునే వారు నల్లని దుస్తులే ఎందుకు ధరించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 29 Nov 2022, 2:02 pm
Ayyappa Devotees శబరిమల అయ్యప్పస్వామి ఆలయ సందర్శన కోసం వెళ్లే వారిలో ఎక్కువ మంది మండల దీక్షను చేపడతారు. 41 రోజుల పాటు చేసే ఈ దీక్షలో కఠినమైన నియమాలను పాటిస్తారు. ఈ వ్రతంలో ఉండేవారంతా ఉదయాన్నే గజ గజ వణికే చలిలో చన్నీటితో స్నానం చేయాలి. కటిక నేలమీదే నిద్రపోవాలి. బ్రహ్మచార్యం పాటించాలి. అన్నింటికంటే ముఖ్యంగా ప్రతిరోజూ నల్లని రంగు బట్టలే ధరించాలని గ్రంథాలలో పేర్కొనబడింది. ఇలా 41 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని పూజించి మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం కోసం వేయి కళ్లతో వేచి చూస్తారు. అనంతరం స్వామి సన్నిధిలో మాలను తొలగిస్తారు.
Samayam Telugu why ayyappa devotees wear black dress to sabarimala ayyappa temple in telugu
Ayyappa Devotees అయ్యప్ప దీక్షలో ఉండే స్వాములు నల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారంటే...


​ఆరోగ్య ప్రయోజనాలు..

అయ్యప్ప దీక్షను తీసుకోవడం వల్ల ఆధ్యాత్మిక భావన పెరగడమే కాదు.. ఆరోగ్య పరంగా ఎంతగానో మేలు చేకూరుతుంది. ఈ మండల దీక్షలో ఉన్నంత కాలం పాటించే పద్ధతుల వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. తెల్లవారుజామునే చల్లని వాతావరణంలో చన్నీటితో స్నానం చేయడం వల్ల మీ మనసు తేలిక పడి అయ్యప్ప స్వామిని పూజించడంలో ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాదు ఎన్నో ఆలోచనలతో ఉండే మన మెదడును సైతం ఉత్తేజపరుస్తుంది.

Ayyappa Swami Irumudi అయ్యప్ప స్వామి ఇరుముడిలో ఉన్న ఆంతర్యాలేంటో తెలుసుకుందామా...

​పాదాలతో నడవడం వల్ల..

అయ్యప్ప మాలను ధరించిన వారు ప్రతిరోజూ చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలపై ఒత్తిడి పెరిగి, రక్త ప్రసరణ, గుండె మంచిగా పని చేస్తుంది. అంతేకాదు ఈ 41 రోజుల పాటు శాకాహారం మాత్రమే తినడం వల్ల, అందులో ఎలాంటి మసాల తిండి ఉండకపోవడం వల్ల జీర్ణ సమస్యలనేవే ఉండవు.

​భగవంతుని అనుగ్రహం లభిస్తుందని..

సాధారణంగా చలికాలంలో అయ్యప్ప మాలను వేసుకునే స్వాములందరూ నల్లని దుస్తులనే ధరిస్తారు. ఎందుకంటే ఇది శరీరంలోని వేడిని గ్రహించి మనకు వెచ్చదనాన్ని ఇస్తుంది. అలాగే శబరిమల యాత్ర కోసం అడవులలో ప్రయాణించే సమయంలో నలుపు రంగు అడవి జంతువుల నుండి మనల్ని కాపాడుతుంది. ఇలా అయ్యప్ప మాలను ధరించిన వారు స్వామి వారి అనుగ్రహం పొందడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. నల్లని దుస్తులను ధరించి దీక్షలో పాల్గొనడం వల్ల శని దేవుని ప్రభావం తొలగిపోతుంది.

​సామాన్య జీవనం అలవడుతుందని..

అయ్యప్ప మాలను ధరించిన వారికి సామాన్య జీవనం గడపడం అలవాటుగా మారుతుంది. అందుకే మాలను తీసిన తర్వాత కూడా వారు చాలా హుందాగా ప్రవర్తిస్తారు. అంతేకాదు మండల దీక్షను చేపట్టిన వారికి.. మిగిలిన జీవితానికి ఆదర్శంగా నిలుస్తుంది. అయ్యప్ప దీక్ష తర్వాత కూడా ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా బతకగలుగుతారు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


Read Latest Religion News and Telugu News

రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.