ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయంలో ఈ ఏడాది నుంచి ఆధునిక వసతి సౌకర్యాలు కల్పించారు. ఏటా పెరుగుతోన్న భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకునిఈ ఏడాది తొలిసారిగా శబరిమలలో నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని కేరళ ప్రభుత్వం మొదలుపెట్టినట్లు దేవాదాయ శాఖా మంత్రి సుందరన్ తెలిపారు. నిత్యాన్నదానం ద్వారా రోజూ 5 వేల మంది భక్తులకు భోజనం ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం 2018 జనవరి 14 మకర విళక్కు (మకర జ్యోతి) వరకూ కొనసాగుతుందని తెలియజేశారు. అలాగే మహిళా భక్తుల కోసం పంపా నది నుంచి అయ్యప్ప సన్నిధానం వరకూ ప్రత్యేక క్యూలైన్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
తొలి మండల పూజలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అయ్యప్ప ఆలయాన్ని నవంబరు 15 న తెరవనున్నారు. బుధవారం ప్రత్యేక పూజలు చేసి, గురువారం నుంచి సాధారణ వేళల్లో స్వామి వారిని భక్తులు దర్శించుకునేందుకు అనుమతించనున్నట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. శబరి గిరుల్లో కొలువున్న ఆయ్యప్ప స్వామిని దర్శించుకోడానికి తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివెళతారు. మరోవైపు ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు శబరిమలకు వచ్చే భక్తులకు నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించింది.
తొలి మండల పూజలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అయ్యప్ప ఆలయాన్ని నవంబరు 15 న తెరవనున్నారు. బుధవారం ప్రత్యేక పూజలు చేసి, గురువారం నుంచి సాధారణ వేళల్లో స్వామి వారిని భక్తులు దర్శించుకునేందుకు అనుమతించనున్నట్టు ఆలయ అధికారులు పేర్కొన్నారు. శబరి గిరుల్లో కొలువున్న ఆయ్యప్ప స్వామిని దర్శించుకోడానికి తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివెళతారు. మరోవైపు ట్రావెన్కోర్ దేవస్వామ్ బోర్డు శబరిమలకు వచ్చే భక్తులకు నిత్యాన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించింది.