యాప్నగరం

అగ్ని స్నానమాచరించే అమ్మవారి ఆలయం ఎక్కడుందో తెలుసా?

రాజస్థాన్ లో ఉదయపుర్ లో అగ్ని స్నానమాచరించే ఇడాన మాత ఆలయం ఉంది. అక్కడ అగ్ని దానంతటా అదే వస్తుంది. ఎక్కువగా పక్షవాతం రోగులు ఇక్కడకు వస్తుంటారు. ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

Samayam Telugu 23 May 2020, 12:11 pm
సంప్రదాయలకు భారతదేశం. ఇక్కడ ఎన్నో సంస్కృతులు, సంప్రదాయలతో పాటు దేవుళ్లూ ఎక్కువే. ముఖ్యంగా విచిత్రమైన ఆలయాలు, ఆచారాలు ఇక్కడ ఉంటాయి. ఆలయ స్తంభాలు గాలిలో ఉంటే.. మరికొన్ని చొట్ల దేవుడికే మద్యం సమర్పిస్తారు. మరికొన్ని చోట్ల నీటిలో దీపం వెలుగుతుంటుంది. ఇలా రకరకాల విషయలాలు, అంతుచిక్కని అంశాలు ఉన్నాయి. మన దేశంలో ఆలయాల దగ్గరకొస్తే ఎంతో సంపదను కలిగి ఉండటమే కాకుండా వింత, విచిత్రమైన అనుభూతులు, అనుభవాలను కలిగజేస్తాయి. ఇదే జాబితాలో మరో దేవాలయం కూడా ఉంది. అక్కడున్న దేవత అగ్నిస్నానమాచరిస్తుంది. అంటే మంట దానంతట అదే ఉద్భవిస్తుంది. మరి ఆలయం ఎక్కడ ఉందో, ఆ గుడి విశిష్టత, చరిత్ర లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Samayam Telugu here is the story of udaipur idana mata and her mysterious fire bath
అగ్ని స్నానమాచరించే అమ్మవారి ఆలయం ఎక్కడుందో తెలుసా?



ఇడాన మాత దేవాలయం..

అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం రాజస్థాన్ లో ఉంది. అక్కడ ఇడాన మాతాలయంగా ప్రసిద్ధి. ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆరావళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్ లోని ఉదయపుర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన రూఫ్ లేకుండా నిర్మించిన ఈ ఆలయం చతురాస్రాకరంలో ఉంది. ఇడాన ఉదయపుర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధి గాంచింది.

​అగ్నిస్నానమాచరించే అమ్మవారు..

ఇక్కడ ఉన్న ఇడాన మాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది. నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారు. మంట దానంతట అదే మండుతుంది. దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మంట.. ఎలా వస్తుందో తెలుసుకునేందుకో ఎంతో మంది ఎన్ని రకాలు పరిశోధనలు చేసిన ఫలితం లేకపోయింది. ఇంతవరకు ఈ మిస్టరీని కనిపెట్టలేకపోయారు.

​మందిరం విశిష్టత..

ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. ముఖ్యంగా పక్షవాతం, మానసిక ఆందోళకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వదాలు పొందుతారు. ఆలయంలో అగ్ని వచ్చినంత కాలం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్థులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఇడాన దేవాలయంలో పుజారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు 10 నుంచి 20 అడుగులు వరకు వస్తుందట.

​ఈ అగ్ని ప్రత్యేకత ఏంటంటే?

ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏమి నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతున్నారు. అందుకే ఈ మంటలను చూసి అమ్మవారు అగ్ని స్నానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతుంటారు. ఈ మంటల కారణంగా ఇక్కడ ఆలయాన్ని విస్తృత పరచలేదు. ఈ మంటలను ప్రత్యంగా చూసినవారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికల తీరతాయని నమ్మకం.

​త్రిశూలానికి మొక్కుతారు..

ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా.. అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు. ముఖ్యంగా సంతానం లేని వారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు. అంతేకాకుండా కోరుకున్న కోరికల తీరతాయని నమ్మకం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.