యాప్నగరం

శివుడును లింగ రూపంలో పూజించే దేవాలయం ఎక్కడుందో తెలుసా?

పరమ శివుడును లింగరూపంలో కొలవడం ఆనవాయితీ.. కానీ శివుడును విగ్రహా రూపంలో కొలిచే ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని సూరుటుపల్లిలో ఉంది. మరి ఈ ఆలయ విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం.

Samayam Telugu 23 May 2020, 12:49 pm
శివుడును లింగ రూపంలో పూజిస్తారనేది అందరికి తెలిసిందే. దాదాపు దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల్లో మహేశ్వరుడును లింగ రూపంలోనే పూజిస్తారు. అయితే ఎన్ని శివాలయాలను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ లో చిత్రూరు జిల్లాలోని సూరుటుపల్లి శివాలయాన్ని తప్పనిసరిగా దర్శించుకోవాలి. ఎందుకంటే ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ శివుడును విగ్రహ రూపంలో పూజిస్తారు. పచ్చని చెట్లు, పరిసరాల మధ్య ఉన్న ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. సూరుటుపల్లి శ్లీ పళ్లి కొండేశ్వరస్వామిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మహేశ్వరుడు. మరి ఈ ఆలయ చరిత్ర, విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Samayam Telugu సూరుటపల్లి శివాలయం


Also Read: అగ్ని స్నానమాచరించే అమ్మవారి ఆలయం ఎక్కడుందో తెలుసా?

ఆలయ చరిత్ర..
దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మధించిన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని విశ్వకల్యాణార్థం పరమ శివుడు స్వీకరిస్తాడు. అనంతరం పార్వతి, పరమేశ్వరులు తిరిగి కైలాసానికి పయనిస్తూ ఉండగా సరిగ్గా పళ్లి కొండేశ్వర క్షేత్రం వద్దకు రాగానే అంతటి పరమేశ్వరుడు కూడా విష ప్రభావానికి లోనవుతాడు. స్పృహతప్పిన పరమశివుడు కాసేపు సర్వమంగళ స్వరూపిని అయిన పార్వతీదేవి ఒడిలో శయనిస్తాడు. పరమ శివుడు మింగిన విషం గరళ కంఠుని శరీరంలోకి పూర్తిగా జీర్ణం కాకుండా పార్వతీ దేవి శివయ్య కంఠాన్ని గట్టిగా పట్టుకుంటుంది. ఈ గరళాన్ని అమృతంగా మార్చిన పార్వతి దేవిని అముదాంబిక అని పిలుస్తారు. ఈ అద్భుత సంఘటనలకు విగ్రహ రూపమే ఈ సురుటుపల్లి దేవాలయం. ఈ ఆలయంలో శివుడు శయనించి దర్శనం ఇస్తున్నందుకు దీన్ని శివ శయన క్షేత్రం అనే పేరు వచ్చిందని చెబుతారు.

శివ స్వరూపం..
శ్రీ పళ్లి కొండేశ్వరస్వామి ఆలయంలో గరళకంఠుడి విగ్రహం దాదాపుగా 12 అడుగుల పొడవు ఉంటుంది. ఈ విగ్రహం సమీపంలో దేవతలు, రుషులు చుట్టూ నిలబడి శివయ్యను ప్రార్థిస్తుండడం, పార్వతీ దేవి ఒడిలొ ముక్కంటి శయనిస్తూ ఉండే స్వామివారి విగ్రహ రూపం భక్తులకు దర్శనమిస్తుంది. అభిషేక ప్రియుడైన శివుడికి.. అభిషేకానికి బదులు తమిళనాడు నుంచి తెచ్చే చందన తైలంతో ప్రతి పదిహేనురోజులకు ఒకసారి పూస్తారు. శివుడు గరళాన్ని తీసుకున్న సమయంలో ఈ తేనెను పూయడం వలన విషప్రభావం తగ్గిందని చరిత్ర చెబుతుంది.

Also Read: Hanging Pillar: గాలిలో వేలాడే స్తంభమున్న దేవాలయం చూశారా?
ఎవరిని ముందు దర్శించుకోవాలంటే..
ఈ ఆలయంలో వెలిసిన దేవతలలో మొదటగా అమ్మవారినే దర్శించుకోవాలని అక్కడి పండితులు చెబుతుంటారు. ఎందుకంటే శివుడి శరీరంలోకి విషం వెళ్ల కుండా పార్వతి దేవి రక్షించింది కాబట్టి ఈ క్షేత్రంలో వెలిసిన అముదాంబికను మొదట దర్శించుకుని అనంతరం స్వామివారిని దర్శించుకోవాలి. అందుకే అమ్మవారిని లోకాలను కాపాడే జగదాంబ అని పిలుస్తారు.

ఆలయానికి ఎలా చేరుకోవచ్చంటే..ఈ దేవాలయాన్ని దర్శించుకోవాలనుకునేవాళ్లు చిత్తూరు లేదా తిరుపతి నుంచి ముందుగా పుత్తూరు చేరుకోవాలి. అక్కడి నుంచి చెన్నైకి వెళ్లే మార్గంలో 21 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది. పుత్తూరు నుంచి ప్రతి పావుగంటకు ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది. ఇతర ప్రైవేటు వాహనాలు కూడా ప్రతి క్షణం అందుబాటులో ఉంటాయి. ఈ క్షేత్రానికి దగ్గరలోనే తిరుపతి తిరుమల దేవస్థానం, కాళహస్తి, తలకోన, ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ తదితర పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.