యాప్నగరం

కనులపండువగా రథసప్తమి వేడుకలు.. జనసంద్రమైన తిరుమలగిరి

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా మలయ్యప్పస్వామి వారు చిన్న శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

Samayam Telugu 1 Feb 2020, 6:00 pm
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు కనులపండువగా సాగుతున్నాయి. శనివారం ఉద‌యం 5.30 గంట‌ల‌కు సూర్యప్రభ వాహన‌సేవతో రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అక్కడి నుంచి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోద‌యాన భానుడి తొలికిర‌ణాలు శ్రీ మ‌లయ‌ప్పస్వామివారి పాదాల‌ను స్పర్శించాయి. ఈ ఘ‌ట్టం వేలాది మంది భ‌క్తుల‌ను క‌నువిందు చేసింది. సూర్యప్రభ వాహనంపై కొలువుదీరిన శ్రీనివాసుడుని భక్తులు దర్శించుకున్నారు.
Samayam Telugu lord balaji


చిన్నశేషవాహనంపై ఊరేగిన స్వామివారు
రథసప్తమి వేడుకల్లో భాగంగా మలయ్యప్పస్వామి చిన్నశేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు 5 తలలుండే చిన్న శేషవాహనంపై స్వామి వారు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. పెద్దశేషవాహనం ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే చిన్నశేషవాహనాన్ని వాసుకిగా పరిగణిస్తారు.
చిన్నశేషవాహనంపై ఊరేగే స్వామి వారిని భక్తితో ధ్యానిస్తే కుండలినీ యోగ సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. బంగారు శేషవాహనంపై శ్రీవారి వాహనయాత్ర శోభాయమానంగా సాగుతోంది. విశేష ఆభరణాలు అలంకారాలతో తిరువీధుల్లో విహరిస్తున్న మలయప్పను భక్తులు తన్మయత్వంతో తిలకిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.