యాప్నగరం

Temples: అంగారుకుడిని ఎరుపు గ్రహం అనడానికి కారణమేంటో తెలుసా..?

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఉన్న అంగారకుడి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అంగారక దోషం జాతకంలో ఉన్నట్లయితే ఈ దేవాలయాన్ని సందర్శిస్తే ఆ దోషం తొలుగుతుంది. మరి ఈ ఆలయం రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Samayam Telugu 30 Sep 2020, 7:25 am
ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విభిన్న సంస్కృతులకు, సంప్రదాయాలు మన భారతదేశం మూలం. పురాతన, విశిష్టమైన ఆలయాలకు నెలవు. మునుల నుంచి నవగ్రహాలు వరకు ఎంతో మంది ఎన్నో వేల దేవాలున్నాయి. ముఖ్యంగా నవగ్రహాల్లోనూ ఒక్కో గ్రహాలని విభిన్నమైన ఆలయాలను నిర్మించారు. అందులోనూ ఎరుపు గ్రహంగా పిలిచే అంగారకుడికి ఎన్నో మందిరాలున్నప్పటికీ.. ఇక్కడ ప్రస్తావిస్తున్న ఆలయానికి మాత్రం ప్రత్యేక స్థానముంది. ఎందుకంటే శివుడు కృప వల్ల అంగారుకుడు జన్మించాడు. అందుకే దీన్ని అంగారకుడు మాతృమూర్తి అని కూడా అంటారు. అంతేకాదు మంగళ గ్రహం ఎర్రగా ఉండటానికి కారణం కూడా ఈ ఆలయాని సంబంధముంది. అంగారకుడు దోషం నుంచి విముక్తి పొందడం కోసం దేశంలోని నలుమూలల నుంచి భక్తులకు ఇక్కడకు వస్తారు. మరి ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ ఎలాంటి ప్రత్యేకత ఉంది?
Samayam Telugu mars planet birth place and significance of and mars temples
Temples: అంగారుకుడిని ఎరుపు గ్రహం అనడానికి కారణమేంటో తెలుసా..?



​ఎక్కడ ఉందంటే..

పైన పేర్కొన్న ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆధ్యాత్మిక రాజధాని అయిన ఉజ్జయినిలో ఉంది. ఈ ఆలయాన్ని మంగళనాథ్ మందిరమని అంటారు. పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరాన్ని అంగారకుడికి తల్లి అని పిలుస్తారు. అంటే ఇక్కడే అంగారకుడు జన్మించాడని చెబుతారు. ఆలయానికి సరిగ్గా పై భాగంలో ఆకాశంలో అంగారకుడు ఉన్నాడని విశ్వసిస్తారు. మత్స్యపురాణం, స్కందపురాణం ప్రకారం అంగారకుడి గురించి వివరణాత్మక ప్రస్తావన ఉంది. దీని ప్రకారం అంగారకుడు ఉజ్జయినిలో జన్మించాడు. అంతేకాకుండా అంగారకుడు ఆలయం ఆయన జన్మస్థానం కారణంగా దైవిక లక్షణాలను కలిగి ఉంది.

​అంగారకుడు ఎరుపు రంగులో ఉండటానికి కారణం..

స్కందపురణాంలోని అవంతిక ఖండం ప్రకారం తన రక్తం నుంచి వందలాది రాక్షసులు పుడతారని అంధకాసురడనే రాక్షసుడికి శివుడు వరం ఇచ్చాడు. అనంతరం భక్తుల బాధలను తీర్చేందుకు మహేశ్వరుడు తానే స్వయంగా అంధకాసురుడితో పోరాడారు. ఇద్దరి మధ్య భీకర యుద్దం జరిగింది. ఈ రణంలో శివుడు చెమట ధారలుగా ప్రవహించింది. చెమట వేడి కారణంగా ఉజ్జయినిలో నేల రెండుగా విడిపోయి అంగారక గ్రహం పుట్టింది. ఎట్టకేటలకు శివుడు.. అసురుడిని సంహరించి కొత్తగా సృష్టించిన అంగారకుడు రాక్షసుడు రక్తపు చుక్కలను గ్రహించాడు. అందుకే అంగారక భూమిని ఎరుపు రంగులో ఉందని అంటారు.

​అంగారకుడిని శివుడి రూపంలో పూజిస్తారు..

ఈ దేవాలయంలో అంగారకుడిని ఆరాధించడం వల్ల జాతకంలో మంగళ దోషమేదైనా ఉన్నట్లయితే తొలగిపోతుందని నమ్ముతారు. ఫలితంగా భక్తుల విపత్తులన్నింటినీ ఈ ఆలయం గ్రహిస్తుందని విశ్వసిస్తారు. అంగారకుడిని.. శివుడు-పృథ్వీ కుమారుడని అంటారు. ఈ కారణంగా అంగారకుడిని ఆలయంలో శివుడిగా పూజిస్తారు. అంగారక చతుర్థి రోజు ఈ ఆలయంలో విశేషమైన పూజలు చేస్తారు. ప్రత్యేక యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు. ఆ రోజున అంగారకుడి ఆరాధించడం ద్వారా ఆయన సంతృప్తి చెందుతాడు. అంగారక శాంతి కోసం ప్రజలు ఈ రోజు చాలా దూరం నుంచి ఉజ్జయిని నగరానికి వస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.