యాప్నగరం

3 రన్స్ తేడాతో పంత్ మిస్సయ్యింది సెంచరీ మాత్రమే కాదు..

గుజరాత్‌ లయన్స్‌పై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడిన రిషబ్ పంత్ మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్సయిన సంగతి తెలిసిందే..

TNN 5 May 2017, 4:26 pm
గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు రిషబ్ పంత్ మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్సయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కొద్దిలో శతకం చేజారినప్పటికీ ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించిన పంత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది. 9 సిక్సర్లు, 6 ఫోర్లతో 43 బంతుల్లోనే 97 పరుగులు చేసిన రిషబ్ దూకుడైన ఇన్నింగ్స్ పట్ల క్రికెట్ ప్రముఖులంతా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఐపీఎల్‌లో తొలి సెంచరీకి మూడు పరుగులు దూరంలోఅవుటైన పంత్ కొద్దిలో అరుదైన రికార్డును కోల్పోయాడు.
Samayam Telugu rishab pant missed younest centurion record in ipl
3 రన్స్ తేడాతో పంత్ మిస్సయ్యింది సెంచరీ మాత్రమే కాదు..


ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు నెలకొల్పే ఛాన్స్‌ను పంత్ కొద్దిలో మిస్సయ్యాడు. ఈ రికార్డు మనీష్ పాండే పేరిట ఉంది. పాండే 19 ఏళ్ల వయసులో సెంచరీ బాదాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడు కూడా మనీష్ పాండే కావడం విశేషం. 2009లో రాయల్ ఛాలెంజర్స్ తరఫున పాండే శతకం సాధించాడు.

ఐపీఎల్‌లో తక్కువ పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లి తొలిస్థానంలో ఉన్నాడు. విరాట్ 99 పరుగుల వద్ద అవుట్ కాగా.. రైనా, రహానే రెండు రన్స్ తేడాతో శతకాన్ని చేజార్చుకున్నారు. తదుపరి మ్యాచ్‌లోనైనా పంత్ సెంచరీ చేస్తాడేమో చూడాలి మరి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.