యాప్నగరం

ఐపీఎల్ రో‘హిట్’ రికార్డు..!

ఇప్పటికే భారత క్రికెటర్లు విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, గౌతమ్ గంభీర్‌లు ఐపీఎల్‌లో 4వేల పరుగులు

TNN 1 May 2017, 7:09 pm
ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు అందుకున్నాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరుగుతున్న మ్యాచ్‌లో నిలకడగా ఆడిన రోహిత్ 4వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు 152 మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబయి కెప్టెన్ ఖాతాలో 30 అర్ధశతకాలతో పాటు ఒక శతకం ఉంది. జట్టు అవసరాల మేరకు ఓపెనర్ నుంచి మిడిలార్డర్ వరకు బ్యాటింగ్ ఆర్డర్‌లో రోహిత్ మారుతూ వస్తున్నా.. అతని స్ట్రైక్‌రేట్ 130.84 ఉండంటం విశేషం. ఇప్పటికే భారత క్రికెటర్లు విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, గౌతమ్ గంభీర్‌లు ఐపీఎల్‌లో 4వేల పరుగులు చేసిన విషయం తెలిసిందే.
Samayam Telugu rohit sharma joins elite list with 4000 indian premier league runs
ఐపీఎల్ రో‘హిట్’ రికార్డు..!


గత ఏడాది గాయంతో భారత్ జట్టుకు దూరమైన రోహిత్ శర్మ.. ఐపీఎల్‌లో సత్తాచాటి మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్నాడు. ఇప్పటి వరకు రోహిత్ శర్మ కెప్టెన్సీలో 9 మ్యాచ్‌లాడిన ముంబయి ఇండియన్స్ ఏడింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరుతో మ్యాచ్‌లో గెలిస్తే అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.