యాప్నగరం

ఫైనల్లో పుణె టార్గెట్ 130

రోహిత్ ఔట్ అనంతరం వచ్చిన హిట్టర్ పొలార్డ్ (7) సిక్స్ కొట్టి ఊపు మీద కనిపించినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.

TNN 21 May 2017, 9:44 pm
ఐపీఎల్ పదో సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌ బౌలర్లు ఉనద్కత్ (2/11), ఆడమ్ జంపా (32/2) ధాటికి ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులకే పరిమితమైంది. క్రునాల్ పాండ్య (47: 38 బంతుల్లో 3x4, 2x6), రోహిత్ శర్మ (24: 22 బంతుల్లో 4x4) మాత్రమే ముంబయి జట్టులో చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ (4), సిమన్స్ (3)లను ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే పెవిలియన్‌కి పంపి జయదేవ్ ఆదిలోనే ముంబయికి షాకివ్వగా.. అనంతరం వచ్చిన అంబటి రాయుడు (12) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. ఈ దశలో క్రునాల్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ నిలకడగా ఆడినా.. ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అతను కూడా ఔటవడంతో ముంబయి 56/4తో కష్టాల్లో నిలిచింది.
Samayam Telugu rps vs mi rising pune supergiant target 130
ఫైనల్లో పుణె టార్గెట్ 130


రోహిత్ ఔట్ అనంతరం వచ్చిన హిట్టర్ పొలార్డ్ (7) సిక్స్ కొట్టి ఊపు మీద కనిపించినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఆదుకుంటాడనుకున్న హార్దిక్ పాండ్య (10), కర్ణ్‌శర్మ (1) కూడా నిరాశపరచడంతో ముంబయి తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ.. చివర్లో క్రునాల్ పాండ్య బ్యాట్ ఝళిపించి రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టడంతో ముంబయి 129 పరుగులైనా చేయగలిగింది. పుణె బౌలర్ల ధాటికి ముంబయి తొలి ఐదు ఓవర్లలో కనీసం ఒక బౌండరీ కూడా కొట్టలేకపోవడం కొసమెరుపు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.