యాప్నగరం

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

మైనర్ బాలికను అపహరించి రెండు రోజుల పాటు నిర్బందించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

TNN 10 Apr 2017, 11:33 am
ఏడో తరగతి చదువుతోన్న మైనర్ బాలికను అపహరించి ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అనంతపురంలోని గుత్తి పట్టణానికి చెందిన మైనర్ బాలికను ఇద్దరు వ్యక్తులు అపహరించి, రెండు రోజులు పాటు బంధించి అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై నిర్బయ చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుత్తి పట్టణం శివారు ప్రాంతానికి చెందిన బాధిత బాలిక ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది.
Samayam Telugu  minor girl gang raped by two youth in ananathapuram
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్


శ్రీరామనవమి రోజు పాఠశాలకు సెలవు కావడంతో ఆ రోజు సాయంత్రం తమ బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ నుంచి తిరిగొస్తుండుగా అదే కాలనీకి చెందిన అశోక్, సురేశ్‌లు బాధితురాలిపై మత్తు మందు చల్లి కారులో ఎత్తుకుపోయారు. అక్కడ నుంచి బెంగళూరు తీసుకెళ్లి ఓ గదిలో ఆమెను రెండు రోజుల పాటు బంధించిన పలుమార్లు అత్యాచారం చేశారు. ఆ తర్వాత అమెను గుత్తి తీసుకొచ్చి వదిలిపెట్టారు. తమ కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అదే రోజు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

శనివారం ఇంటి చేరుకున్న బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపింది. నిందితులు తనను అపహరించి బెంగళూరు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్దారని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి అదనపు చికిత్స కోసం అనంతపురం జిల్లా ఆస్పత్రికి పంపారు. నిందితులపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు. నిదింతుల కోసం గాలిస్తున్నామని వారి త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.