యాప్నగరం

హాస్టల్ రూం నం. 308లో సుందర్ పిచాయ్

అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భారత్ పర్యటనలో భాగంగా ఆయన చదివిన ఐఐటీ ఖరగ్‌పూర్‌ను సందర్శించారు.

TNN 7 Jan 2017, 1:02 pm
అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ భారత్ పర్యటనలో భాగంగా ఆయన చదివిన ఐఐటీ ఖరగ్‌పూర్‌ను సందర్శించారు. 1993లో భారత్‌ను వదిలిపెట్టిన తరవాత మళ్లీ ఐఐటీ ఖరగ్‌పూర్‌ని సుందర్ సందర్శించడం ఇదే తొలిసారి. ఐఐటీ సందర్శనలో భాగంగా అక్కడి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు గూగుల్ సీఈవో. అంతేకాకుండా తన కాలేజీ జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. చదువుకునే రోజుల్లో ఆయన ఉన్న హాస్టల్ రూం నం.308ను కూడా పిచాయ్ సందర్శించారు. మరోవైపు గూగుల్ ఆధ్వర్యంలో ఖరగ్‌పూర్ సమీపంలోని గోకుల్‌పూర్‌లో నిర్వహిస్తున్న ‘ఇంటర్నెట్ సాథి’ కార్యక్రమంలో భాగమైన మహిళలను కూడా పిచాయ్ కలిసారు. వారితో ముఖాముఖి నిర్వహించారు. అ ఈ మేరకు భారత్ పర్యటనలో పిచాయ్ కొన్ని అరుదైన ఫొటోలు మీకోసం..
Samayam Telugu 10 best pictures from google ceo sundar pichais india visit
హాస్టల్ రూం నం. 308లో సుందర్ పిచాయ్

తన హాస్టల్ రూం నం. 308లో పిచాయ్ దరహాసం


23 సంవత్సరాల తరవాత క్యాంపస్‌లో..


గోకుల్‌పూర్‌లో పిచాయ్‌కి క్యాప్ పెడుతున్న మహిళ


గోకుల్‌పూర్ గ్రామంలో పిల్లలతో క్రికెట్ ఆడుతూ..


ఐఐటీ విద్యార్థులతో ఓ సెల్ఫీ..


ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి విశిష్ట పట్టభద్రుడు పురస్కారం అందుకున్న సమయంలో..


ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో గూగుల్ ఉచిత వైఫైను పరీక్షిస్తూ..


గోకుల్‌పూర్ గ్రామంలో మహిళలతో ముఖాముఖి


పిచాయ్‌ని కలవడానికి బారులు తీరిన ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులు


గోకుల్‌పూర్‌లో మహిళలతో మాట్లాడుతున్న గూగుల్ సీఈవో

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.