యాప్నగరం

ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

ఇంటర్మీడియట్ పరీక్షల్లో కుమార్తె మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన సంతోషంలో దైవదర్శనానికి వెళ్తూ కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.

TNN 12 Jun 2017, 11:39 am
ఇంటర్మీడియట్ పరీక్షల్లో కుమార్తె మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన సంతోషంలో దైవదర్శనానికి వెళ్తూ కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బరేలీకి చెందిన మహేశ శర్మ తన కూతురు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిందనందుకు రాజస్థాన్‌లోని మెహందీపూర్ బాలాజీ ఆలయానికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారు జామున మథుర సమీపంలో కాల్వలో బోల్తా పడటంతో డ్రైవర్ సహ పదిమందిని మృత్యువు కబలించింది. ఈ ప్రమాదానికి అధిక వేగమే కారణమని, మలుపు దగ్గర అదుపు చేయలేకపోవడంతో కారు కాల్వలోని దూసుకుపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Samayam Telugu 10 killed as car falls into canal in mathura
ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి


మహేశ్ శర్మ కుటుంబం శనివారం రాత్రి 11 గంటలకు బరేలీ నుంచి దౌసాకు బయలుదేరింది. ఈ ఘటనలో మహేశ్, భార్య పూనమ్, నలుగురు పిల్లలు రితిక్, హార్దిక్, మనసి, ఖష్బూతోపాటు అతడి సోదరి పూనమ్, ఆమె పిల్లలు రోహన్, సురభి కూడా ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారమే ప్రయాణించాల్సి ఉన్నా డ్రైవర్ బంధువు మరణించడంతో శనివారానికి వాయిదా వేసుకున్నారు. కాల్వలో మృతదేహాలను వెలికితీసి వారి బంధువులకు అప్పగించినట్లు మథుర సీనియర్ ఎస్పీ వినోద్ కుమార్ మిశ్రా తెలిపారు. వాహనాన్ని కూడా బయటకు తీశామని పేర్కొన్నారు. కాల్వపై వంతెన ఇరుకుగా ఉండటంతో ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ చోటుచేసుకుంటున్నాయని, తక్షణమే మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.