యాప్నగరం

ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది సజీవదహనం

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న చిరుతిళ్ల దుకాణంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో12 మంది సజీవదహనమయ్యారు.

TNN 18 Dec 2017, 11:35 am
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 12 మంది సజీవదహనమయ్యారు. సోమవారం ఉదయం సకినక ప్రాంతంలోని భాను ఫర్సాన్ చిరుతిళ్ల దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. లక్ష్మీనారాయణ ఆలయం సమీపంలోని భాను ఫర్సాన్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఉదయం 4.17 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు నాలుగు ఫైర్ ఇంజిన్లు, నాలుగు వాటర్ ట్యాంకర్లను అక్కడకు తరలించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. ఈ ప్రమాదంలో మరణించిన 12 మంది అందులో పనిచేసే కార్మికులుగా అనుమానిస్తున్నారు.
Samayam Telugu 12 killed as fire breaks out in mumbai shop
ఘోర అగ్నిప్రమాదం.. 12 మంది సజీవదహనం


ఓ పక్క నిర్మాణం కొనసాగుతుండగా, మరోవైపు దుకాణం నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల విద్యుత్ ఉపకరణాలు, ఫర్నిచర్, పెద్ద మొత్తంలో ఆహార పదార్థాలు కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదం జరిగే సమయంలో సుమారు 10 నుంచి 15 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీళ్లంతా అదే భవంతిలో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రారంభమైన మంటలు మొదటి అంతస్తుకి వ్యాపించడంతో ఊపిరాడక కొందరు, కార్మికులు సజీవదహనం అయ్యారు. అంతేకాదు ప్రమాద తీవ్రతకు నిర్మాణంలో కొంత భాగం కుప్పకూలింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.