గుట్టు చప్పుడు కాకుండా మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ఓ పెద్ద మనిషి..తనతో సంసారం చేయాలంటూ ఆమెకు లాయర్ నోటీసులు పంపాడు.
ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం..గతేడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రిపేర్ అవుతుండగా...పదిహేళ్ల వయసున్న ఆమెకు 45ఏళ్ల వ్యక్తితో ఇంట్లో వాళ్లు బలవంతంగా పెళ్లి చేశారు.
ఆ పెద్దాయన తల్లి చనిపోయే దశలో ఉందని, ఆమె చివరి కోరిక తీర్చడం కోసం మైనర్ బాలికను ఇచ్చి పెళ్లి చేశారు. ఆయనతోనే ఉండాలని బాలిక తల్లిదండ్రులు బలవంతంపెట్టారు.
‘‘అది (పెళ్లి) ఆకస్మాత్తుగా జరిగింది. అతడు నాకంటే 35ఏళ్లు పెద్ద. ఆ సమయంలో ఈ విషయం తెలియదు’’ అని ఆమె ఎన్టీటీవీతో వాపోయారు. అత్తింటివారు పదో తరగతి పరీక్షలకు కూడా కూర్చోనివ్వలేదని ఆమె అంటోంది. అత్తింటివారింటికెళ్లాక శారీరకంగా, మానసికంగా భర్త హింసించారని విలపించింది.
పెళ్లి తర్వాత రెండు నెలల తర్వాత ఆ బాలిక తలిదండ్రుల వద్దకు వచ్చేసింది. తల్లిదండ్రులు కూడా ఆమెను అక్కున చేర్చుకున్నారు. దీంతో పెళ్లి సమయంలో ‘అల్లుడి’కి కట్నం కింద ఇచ్చిన రూ.లక్ష, బంగారం తిరిగి ఇచ్చివేయాలని అడగడంతో..అతడు ‘దాంపత్యపు’ హక్కుల కింద బాలికకు లీగల్ నోటీసులు పంపించాడు.
బాలిక ప్రస్తుతం సాయం చేయాలంటూ బాలల హక్కుల కార్యకర్తలను ఆశ్రయించింది.
బాలిక మొర విన్న ఓ బాలల హక్కుల కార్యకర్త ఇరు కుటుంబాలు, పంచాయతీ పెద్దలతో సమావేశం నిర్వహించారు. అయితే ఆ బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి మాత్రం తాను కట్నంగా తీసుకున్న నగదును తిరిగివ్వనని, బాలికను తనతో పంపాలని, అవసరమైతే ఆ నగదును లాయర్ల కోసం ఖర్చు పెడతానని హెచ్చరిస్తున్నాడు.
బాలికకు దాంపత్యపు హక్కుల కింద నోటీసులు పంపడాన్ని బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు ఆందోళన వ్యక్తం చేశారు. బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేయకుండా..ఆమెను ‘దాంపత్య’పు హక్కులంటూ నోటీసులు పంపిన లాయర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆ బాలిక...తన భర్త దగ్గరికి వెళ్లనని తెగేసి చెబుతోంది. ‘‘నేను చదువుకోవాలి. నా కాళ్ల మీద నేను నిలబడాలి’’ అని ఆమె చెబుతోంది.
అయితే న్యాయనిపుణులు మాత్రం ఆమె ప్రస్తుతం మైనర్ గనక మైనార్టీ తీరకముందే కోర్టుకెళ్లి తన పెళ్లిని రద్దు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం..గతేడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రిపేర్ అవుతుండగా...పదిహేళ్ల వయసున్న ఆమెకు 45ఏళ్ల వ్యక్తితో ఇంట్లో వాళ్లు బలవంతంగా పెళ్లి చేశారు.
ఆ పెద్దాయన తల్లి చనిపోయే దశలో ఉందని, ఆమె చివరి కోరిక తీర్చడం కోసం మైనర్ బాలికను ఇచ్చి పెళ్లి చేశారు. ఆయనతోనే ఉండాలని బాలిక తల్లిదండ్రులు బలవంతంపెట్టారు.
‘‘అది (పెళ్లి) ఆకస్మాత్తుగా జరిగింది. అతడు నాకంటే 35ఏళ్లు పెద్ద. ఆ సమయంలో ఈ విషయం తెలియదు’’ అని ఆమె ఎన్టీటీవీతో వాపోయారు. అత్తింటివారు పదో తరగతి పరీక్షలకు కూడా కూర్చోనివ్వలేదని ఆమె అంటోంది. అత్తింటివారింటికెళ్లాక శారీరకంగా, మానసికంగా భర్త హింసించారని విలపించింది.
పెళ్లి తర్వాత రెండు నెలల తర్వాత ఆ బాలిక తలిదండ్రుల వద్దకు వచ్చేసింది. తల్లిదండ్రులు కూడా ఆమెను అక్కున చేర్చుకున్నారు. దీంతో పెళ్లి సమయంలో ‘అల్లుడి’కి కట్నం కింద ఇచ్చిన రూ.లక్ష, బంగారం తిరిగి ఇచ్చివేయాలని అడగడంతో..అతడు ‘దాంపత్యపు’ హక్కుల కింద బాలికకు లీగల్ నోటీసులు పంపించాడు.
బాలిక ప్రస్తుతం సాయం చేయాలంటూ బాలల హక్కుల కార్యకర్తలను ఆశ్రయించింది.
బాలిక మొర విన్న ఓ బాలల హక్కుల కార్యకర్త ఇరు కుటుంబాలు, పంచాయతీ పెద్దలతో సమావేశం నిర్వహించారు. అయితే ఆ బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి మాత్రం తాను కట్నంగా తీసుకున్న నగదును తిరిగివ్వనని, బాలికను తనతో పంపాలని, అవసరమైతే ఆ నగదును లాయర్ల కోసం ఖర్చు పెడతానని హెచ్చరిస్తున్నాడు.
బాలికకు దాంపత్యపు హక్కుల కింద నోటీసులు పంపడాన్ని బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు ఆందోళన వ్యక్తం చేశారు. బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేయకుండా..ఆమెను ‘దాంపత్య’పు హక్కులంటూ నోటీసులు పంపిన లాయర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆ బాలిక...తన భర్త దగ్గరికి వెళ్లనని తెగేసి చెబుతోంది. ‘‘నేను చదువుకోవాలి. నా కాళ్ల మీద నేను నిలబడాలి’’ అని ఆమె చెబుతోంది.
అయితే న్యాయనిపుణులు మాత్రం ఆమె ప్రస్తుతం మైనర్ గనక మైనార్టీ తీరకముందే కోర్టుకెళ్లి తన పెళ్లిని రద్దు చేయించుకోవాలని సూచిస్తున్నారు.