పాన్ మసాలా కోసం ఓ కుర్రాడు స్నేహితుడినే పొడిచి చంపిన సంఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది.
పోలీసులు, సంఘటన ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... అహ్మదాబాద్ నరోడాలోని జై అపార్ట్ మెంట్లో వేర్వేరు ప్లాట్లలో నివాసముండే నేహల్ పటేల్ (19), కృణల్ పాటిల్ (19) స్నేహితులు.
వీరిద్దరు మరో ఇద్దరు స్నేహితులు మహేంద్ర పాటిల్, సునిల్ పటేల్లతో కలిసి శనివారం అర్థరాత్రి దాటేంత వరకు అక్కడ జరిగిన గర్బ డాన్స్ ప్రోగ్రామ్ తిలికించారు.
తెల్లవారు జాము 3గంటలకు నేహల్ పటేలు పాన్ మసాలా కావాలని సునీల్ పటేల్ను అడిగాడు. తన దగ్గర లేదని సునీల్ సమాధానమివ్వడంతో నేహల్ కోపంతో అతణ్ని కొట్టాడు. ‘సునీల్ ను కొట్టొద్దని, అతడు అనాథ అని’ కృనల్ నేహల్ను హెచ్చరించాడు గొడవను ఆపాడు.
కృనల్ తనను అవమానించడాని భావించిన నేహల్ ఇంటికెళ్లి కత్తితో వచ్చాడు. కృనల్ ను కడుపులో పొడిచాడు. అడ్డం వచ్చిన మరోస్నేహితుడు మహేంద్ర పటేల్ ను సైతం పొడవబోయాడు. అయితే మహేంద్ర చిన్నపాటి గాయాలతో తప్పించుకున్నాడు.
కృనల్ రక్తపు మడుగులో పడిఉండటంతో భయంతో కత్తి అక్కడే పడేసి నేహల్ పారిపోయాడు. కృనల్ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. మహేంద్ర పటేల్ ఫిర్యాదుతో నేహల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
పోలీసులు, సంఘటన ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... అహ్మదాబాద్ నరోడాలోని జై అపార్ట్ మెంట్లో వేర్వేరు ప్లాట్లలో నివాసముండే నేహల్ పటేల్ (19), కృణల్ పాటిల్ (19) స్నేహితులు.
వీరిద్దరు మరో ఇద్దరు స్నేహితులు మహేంద్ర పాటిల్, సునిల్ పటేల్లతో కలిసి శనివారం అర్థరాత్రి దాటేంత వరకు అక్కడ జరిగిన గర్బ డాన్స్ ప్రోగ్రామ్ తిలికించారు.
తెల్లవారు జాము 3గంటలకు నేహల్ పటేలు పాన్ మసాలా కావాలని సునీల్ పటేల్ను అడిగాడు. తన దగ్గర లేదని సునీల్ సమాధానమివ్వడంతో నేహల్ కోపంతో అతణ్ని కొట్టాడు. ‘సునీల్ ను కొట్టొద్దని, అతడు అనాథ అని’ కృనల్ నేహల్ను హెచ్చరించాడు గొడవను ఆపాడు.
కృనల్ తనను అవమానించడాని భావించిన నేహల్ ఇంటికెళ్లి కత్తితో వచ్చాడు. కృనల్ ను కడుపులో పొడిచాడు. అడ్డం వచ్చిన మరోస్నేహితుడు మహేంద్ర పటేల్ ను సైతం పొడవబోయాడు. అయితే మహేంద్ర చిన్నపాటి గాయాలతో తప్పించుకున్నాడు.
కృనల్ రక్తపు మడుగులో పడిఉండటంతో భయంతో కత్తి అక్కడే పడేసి నేహల్ పారిపోయాడు. కృనల్ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతి చెందాడు. మహేంద్ర పటేల్ ఫిర్యాదుతో నేహల్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.