యాప్నగరం

తండ్రి ఎదుటే కుమార్తెలపై గ్యాంగ్‌రేప్

తండ్రి, 13, 15 ఏళ్ల ఇద్దరు కుమార్తెలను బలవంతంగా స్నేహితుల సాయంతో వ్యాన్‌లోకి ఎక్కించి ..అనంతరం

TNN 17 Mar 2017, 6:37 am
తండ్రిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో అతని ఇద్దరు కుమార్తెలపై ఆరుగురు వ్యక్తులు దారుణంగా సామూహిక అత్యాచారం చేసిన ఘటన గుజరాత్‌లోని దహూద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇటీవల కల్తీ మద్యం కేసులో కామత్ బారియా అనే వ్యక్తి కొడుకును ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకి బాలికల తండ్రి సహకరించాడనే కోపంతో కామత్ బారియా
Samayam Telugu 2 teenage girls abducted gangraped in front of father
తండ్రి ఎదుటే కుమార్తెలపై గ్యాంగ్‌రేప్

ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. గురువారం షాప్ వద్ద ఉన్న తండ్రి, 13, 15 ఏళ్ల ఇద్దరు కుమార్తెలను బలవంతంగా స్నేహితుల సాయంతో వ్యాన్‌లోకి ఎక్కించాడు. అనంతరం కదులుతున్న వ్యానులోనే ఐదు మందితో కలిసి తండ్రి ఎదుటే ఆ బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

అత్యాచారం అనంతరం తండ్రితో పాటు బాలికల్ని మాండవ్ గ్రామం వద్ద వ్యాన్ నుంచి దింపేసిన నిందితులు ఈ విషయాన్ని పోలీసులకి చెప్తే చంపేస్తామని హెచ్చరించినట్లు బాధితురాళ్ల తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 13 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు కామత్ బారియాతో పాటు ఐదు మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. వ్యానులో ఆరుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడగా.. ద్విచక్రవాహనం ద్వారా వారిని అనుసరిస్తూ నలుగురు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. బాలికలను వైద్య చికిత్స కోసం దేవ్‌గర్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.