ఇది పాతికేళ్ల క్రితం నాటి సంగతి.. అహ్మద్ అనే వ్యక్తి ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్నగర్లో హార్డ్ వేర్ షాపు నడిపేవాడు. అప్పట్లో రౌడీయిజం ఎక్కువగా ఉండేది. దుకాణదారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసేవారు. పోలీసుల సాయం కోరినా ఫలితం ఉండేది కాదు. ఓ రోజు గుండాలొచ్చి డబ్బులు ఇవ్వమని ఒక వ్యాపారిని బెదిరిస్తుంటే.. అహ్మద్ అడ్డువెళ్లాడు. దీంతో పట్టపగలే దుండగులు అతణ్నికాల్చి చంపేశారు. 1992లో ఈ ఘటన జరిగినప్పుడు అతడి కుమార్తె అంజుమ్ సైఫీకి నాలుగేళ్లు. కానీ రక్తపు మడుగులో తండ్రి పడి ఉన్న దృశ్యం మాత్రం ఆమె మనసులో నిలిచిపోయింది.
చిన్నారి అంజుమ్ను జడ్జిగా చూడాలనేది అహ్మద్ కల. అందుకే ఎప్పుడూ.. నువ్వు జడ్జివి కావాలమ్మా అని చెబుతుండేవాడు. ఆయన మరణించిన పాతికేళ్ల తర్వాత అంజుమ్ తండ్రి కోరికను నెరవేర్చింది. ఉత్తర ప్రదేశ్ సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన జూనియల్ డివిజన్ సివిల్ జడ్జిల ఫలితాల్లో ఆమె విజయం సాధించింది. తండ్రి కోరిక నెరవేర్చడానికి అంజుమ్తోపాటు ఆమె ఐదుగురు సోదరులు తీవ్రంగా శ్రమించారు. ఆమె పెద్దన్నయితే 40 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోలేదు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలను భుజానికెత్తుకున్నాడు. ఇన్నేళ్ల కష్టం ఫలించినందుకు ఇప్పుడు వారెంతో సంతోషిస్తున్నారు.
‘పిల్లల్ని చదివించడం కోసం అహ్మద్ మర్డర్ కేసును కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ల జీవితాలను ఫణంగా పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికి ఆయన కోరిక నెరవేరింద’ని అంజుమ్ తల్లి హమీదా బేగం ఆనంద భాష్పాలను కార్చింది. మా నాన్న న్యాయం కోసం మరణించాడు. తను సమాజాన్ని మార్చాలని అనుకున్నాడు. విలువల్ని కాపాడటం, మంచితనంపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేయడమే నా ముందున్న కర్తవ్యం అని అంజుమ్ తెలిపింది. ఇప్పుడు నాకు దేవుడు శక్తిని ఇచ్చాడు. నాన్న త్యాగం వృథా కానీయను. మార్పు కోసం నా శక్తి మేర కృషి చేస్తానని ఆమె ఆనందంగా చెప్పింది.
చిన్నారి అంజుమ్ను జడ్జిగా చూడాలనేది అహ్మద్ కల. అందుకే ఎప్పుడూ.. నువ్వు జడ్జివి కావాలమ్మా అని చెబుతుండేవాడు. ఆయన మరణించిన పాతికేళ్ల తర్వాత అంజుమ్ తండ్రి కోరికను నెరవేర్చింది. ఉత్తర ప్రదేశ్ సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన జూనియల్ డివిజన్ సివిల్ జడ్జిల ఫలితాల్లో ఆమె విజయం సాధించింది. తండ్రి కోరిక నెరవేర్చడానికి అంజుమ్తోపాటు ఆమె ఐదుగురు సోదరులు తీవ్రంగా శ్రమించారు. ఆమె పెద్దన్నయితే 40 ఏళ్లొచ్చినా పెళ్లి చేసుకోలేదు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలను భుజానికెత్తుకున్నాడు. ఇన్నేళ్ల కష్టం ఫలించినందుకు ఇప్పుడు వారెంతో సంతోషిస్తున్నారు.
‘పిల్లల్ని చదివించడం కోసం అహ్మద్ మర్డర్ కేసును కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. వాళ్ల జీవితాలను ఫణంగా పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికి ఆయన కోరిక నెరవేరింద’ని అంజుమ్ తల్లి హమీదా బేగం ఆనంద భాష్పాలను కార్చింది. మా నాన్న న్యాయం కోసం మరణించాడు. తను సమాజాన్ని మార్చాలని అనుకున్నాడు. విలువల్ని కాపాడటం, మంచితనంపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేయడమే నా ముందున్న కర్తవ్యం అని అంజుమ్ తెలిపింది. ఇప్పుడు నాకు దేవుడు శక్తిని ఇచ్చాడు. నాన్న త్యాగం వృథా కానీయను. మార్పు కోసం నా శక్తి మేర కృషి చేస్తానని ఆమె ఆనందంగా చెప్పింది.