యాప్నగరం

800 ఏళ్ల తర్వాత పునర్జన్మించిన యువరాజు!!

ఇటీవల భారత్ పర్యటనకు విచ్చేసిన భూటన్ రాజ కుటుంబం బిహార్‌లోని నలంద విశ్వవిద్యాలయాన్నిసందర్శించింది. ఈ సందర్భంలో మూడేళ్ల యువరాజు ఆసక్తికరమైన విషయాలు వెలువరించారు.

TNN 6 Jan 2017, 3:00 pm
800 ఏళ్ల కిందట ఇండియాలోని నలంద విశ్వవిద్యాలయంలో తన విద్యాభ్యాసం జరిగిందని భూటాన్ యువరాజు కొడుకు మూడేళ్ల బాలుడు తెలిపిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు 824 ఏళ్ల తర్వాత పునర్జన్మ లభించిందని ఆ బాలుడు తెలిపడం విశేషం. అంతే కాదు అప్పట్లో నలంద విశ్వవిద్యాలయంలో భోజన శాల, తరగతి గదులతోపాటు వసతి గృహాలు ఎక్కడున్నాయో చూపుతున్నాడు.
Samayam Telugu 3 years old bhutan royal baby rebirth in nalanda bihar
800 ఏళ్ల తర్వాత పునర్జన్మించిన యువరాజు!!


గతంలో ఇండియాలో జన్మించిన మా మనవడు పునర్జన్మలో మళ్లీ పుట్టాడు. విద్యాభ్యాసం చేసిన ఈ పరిసరాలను ఆయన గుర్తు పట్టాడు. ఇక్కడి నిర్మాణాలు శిథిలమైపోయావని చెబుతుంటే నమ్ముతున్నామని భూటాన్ మహారాణి, రాజమాత దోర్జి వాంగ్ చుక్ వ్యాఖ్యానించారు. తన మనవడితో కలసి భారత్‌కు విచ్చేసిన ఆమె, నలంద ప్రాంతంలో మనవడు చెబుతున్న వందల ఏళ్ల నాటి విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

చిన్నతనంలోనే ఈ ప్రాంతంలో ఆడుకున్నానని వేలు పెట్టి చూపిస్తున్న యువరాజు వీడియో ఇప్పుడు టీవీల్లో హల్‌చల్ చేస్తోంది. గత జన్మలో తాను నలంద విశ్వవిద్యాలయంలో చదువుకున్నానని మా మనవడు చెబుతున్నాడు. ఇక్కడ మార్గాలన్నీ ఆ పసివాడికి గుర్తున్నాయి. ప్రస్తుత ప్రాంతంలో ఎనిమిది శతాబ్దాల కిందట ఏ ఏ వస్తువులున్నాయో చెబుతుంటే ఆశ్చర్యమేసింది.. తను చెప్పినవన్నీ నిజమే. ఇండియాలో పర్యటిస్తున్న ఈ రోజులు మాకు చాలా ప్రత్యేకమైనవని, వీటిని జీవితాంతం మా మనసులో పదిలపరుచుకుంటామని రాజమాత దోర్జీ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.