యాప్నగరం

ఈ రాఖీని మీరు కట్టుకోలేరు...

పర్యావరణహితాన్ని కోరుతూ 35 అడుగుల పెద్దదయిన రాఖీని తయారుచేశారు

TNN 18 Aug 2016, 7:38 pm
ఈ రక్షా బంధన్ పర్వదినాన దేశ వ్యాప్తంగా పలు చోట్ల వినూత్న రీతిలో రాఖీలను తయారుచేసి అమ్మకానికి పెట్టారు. యూపీలో రాఖీల తయారీదారులు ప్రధాని నరేంద్రమోడీ రాఖీలను తయారుచేసి అమ్మకానికి పెట్టగా వాటికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అలాగే నాగపూర్లో పర్యావరణహితాన్ని కోరుతూ 35 అడుగుల పెద్దదయిన రాఖీని తయారుచేయగా అది అందరినీ ఆకట్టుకుంటోంది. దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టాలని కోరుతూ నాగపూర్లోని లలిత్ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఈ భారీ రాఖీని రూపొందించారు. దీన్ని ప్రదర్శనకు ఉంచగా చూసేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున వచ్చారు.
Samayam Telugu 35 foot long eco friendly rakhi seeks to spread social awareness
ఈ రాఖీని మీరు కట్టుకోలేరు...


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.