యాప్నగరం

ఆస్తి కోసం.. కన్నతండ్రినే ఈడ్చుకెళ్లి..

ఆస్తి రాసిస్తేనే ఇంటికి తీసుకొస్తాం.. లేకపోతే అక్కడే చావు’ అంటూ ఆ తండ్రిని దూషించారు. గ్రామస్థులంతా చూస్తుండగానే ..

TNN 13 Jul 2017, 6:12 pm
ఆస్తి కోసం.. కన్న తండ్రినే దారుణంగా హించించారు. రక్తం పంచిచ్చాడనే విషయాన్ని కూడా మరచిపోయి.. కాళ్లు, చేతులు కట్టేసి రాక్షసంగా ప్రవర్తించారు. ఈ దారుణం కర్ణాటకలో చోటు చేసుకుంది. తన తండ్రి ఆస్తి మొత్తాన్ని తమకు రాసివ్వలేదనే కోపంతో ఇద్దరు సోదరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నింగపురం గ్రామానికి చెందిన షేకప్ప మనగూళికి ఇద్దరు కొడుకులు. షేకప్పకు చెందిన భూమి, ఇల్లు తదితర ఆస్తులన్నీ ఆయన పేరుపైనే ఉన్నాయి. ఆస్తులు పంచాలని కొడుకులు కన్నప్ప, ఎల్లప్ప చాలా రోజుల నుంచి ఒత్తిడి చేస్తున్నారు. తాను చనిపోయిన తర్వాతే ఆస్తులు పంచుకోవాలని.. అప్పటివరకు రాసివ్వనని షేకప్ప తేల్చి చెప్పాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకులు.. కన్న తండ్రిపైనే దాడికి దిగారు.
Samayam Telugu 80 years old father brutally attacked by his sons in karnataka
ఆస్తి కోసం.. కన్నతండ్రినే ఈడ్చుకెళ్లి..


80 ఏళ్ల ఆ వృద్ధ తండ్రి చేతులు, కాళ్లు కట్టేసి దారుణంగా కొట్టారు. ఓ కొడుకు కాళ్లు పట్టుకుంటే.. మరో కొడుకు చేతులు పట్టుకుని కొట్టాడు. అలాగే కట్టేసి.. ఊరిచివర ఉన్న పొలంలోకి ఈడ్చుకెళ్లి పడేశారు. ‘ఆస్తి రాసిస్తేనే ఇంటికి తీసుకొస్తాం.. లేకపోతే అక్కడే చావు’ అంటూ ఆ తండ్రిని దూషించారు. గ్రామస్థులంతా చూస్తుండగానే ఈ తంతు జరిగినా వాళ్లను అడ్డుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.

ఈ రాక్షసకాండను కొంత మంది వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో అది వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ సోదరులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ ఉదంతంపై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.