మెదడులో కణితి వైద్యం కోసం హాస్పిటల్లో చేరిన వారం రోజుల వ్యవధిలోనే ఓ యువతి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవించేవరకు ఆమె గర్భవతి అన్న విషయం డాక్టర్లు గుర్తించకపోవడం గమనార్హం. కణితి చికిత్స కోసం ముంబైలోని జేజే హాస్పిటల్లో చేరిన 20 ఏళ్ల మేఘా ధైజేకర్ డిసెంబరు 26 న కడుపు నొప్పితో బాధపడటంలో న్యూరోసర్జన్ నొప్పి నివారణకు గోళీలు రాసి ఇచ్చాడు. అయితే ఆమె డిసెంబరు 27 ఉదయం 2 గంటలకు మగబిడ్డను ప్రసవించింది.
ఆమె గర్భవతి అన్న విషయం అటు కుటుంబ సభ్యులకు, ప్రియుడికి తెలియకుండా నెట్టుకొచ్చింది. అసలు ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు కూడా ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు. గతంలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్లో కూడా బయటపడకపోవడం అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే పెళ్లి కాకుండానే తల్లైన మేఘా డిసెంబరు 29 న వివాహితగా హాస్పిటల్ నుంచి ఇంటికి చేరింది.
ఓ ప్రైవేట్ కంపెనీలో సహాయకుడిగా పనిచేసే 21 ఏళ్ల రామచంద్ర వాస్కార్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని ఒప్పించి వివాహం చేశారు. జేజే హాస్పిటల్లో డిసెంబరు 29 వైద్యులు, పోలీసులు దగ్గరుండి అతడితో వివాహం జరిపించారు. ఆస్పత్రి సిబ్బంది జోక్యం చేసుకోకపోతే ఈ కథ సుఖాంతం అయ్యేది కాదు. అంతకు ముందు సిబ్బంది ఆమెకు కౌన్సెలింగ్ చేసి బాయ్ఫ్రెండ్ గురించి ఆరా తీయడంతో అతడి వివరాలను తెలియజేసింది.
జేజే మార్గ్ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ విషయం గురించి రామచంద్రకు తెలియజేసి మేఘాను భార్యగానూ, ఆమెకు పుట్టిన బిడ్డను తక కొడుకుగా స్వీకరించేలా ఒప్పించారు. ఇంటర్మీడియట్ చదువుకున్న మేఘాకు 2015 అక్టోబరులో రామచంద్రతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత తరచూ వీరు కలుసుకునేవాళ్లు. గత మేలో గర్బం దాల్చిన మేఘా ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టింది.
నవంబరులో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వైద్యం కోసం జీటీ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ ఎంఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులు మెదడులో కణితి ఉన్నట్లు గుర్తించి జేజే హాస్పిటల్కు సిఫార్సు చేశారు. ఆమె వైద్యం కోసం డిసెంబరు 21 న న్యూరోసర్జరీ విభాగంలో అడ్మిట్ అయ్యింది. ఈ విషయం గురించి రామచంద్ర ముంబై మిర్రర్తో మాట్లాడుతూ తాము తరచూ కలుసుకున్నా ఈ విషయం గురించి ఒక్కసారి కూడా చెప్పలేదని అన్నాడు.
గత జూన్లో మేఘా తల్లి ఆనారోగ్యంతో మరణించినపుడు కూడా వెళ్లాను కానీ అప్పుడైనా చెప్పలేదని తెలిపాడు. చెల్లెలు గర్భం దాల్చిన విషయం తమకు కూడా తెలియకపోవడం వింతగా ఉందని ఆమె సోదరుడు అన్నాడు.
ఆమె గర్భవతి అన్న విషయం అటు కుటుంబ సభ్యులకు, ప్రియుడికి తెలియకుండా నెట్టుకొచ్చింది. అసలు ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు కూడా ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు. గతంలో ఎంఆర్ఐ, సీటీ స్కాన్లో కూడా బయటపడకపోవడం అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే పెళ్లి కాకుండానే తల్లైన మేఘా డిసెంబరు 29 న వివాహితగా హాస్పిటల్ నుంచి ఇంటికి చేరింది.
ఓ ప్రైవేట్ కంపెనీలో సహాయకుడిగా పనిచేసే 21 ఏళ్ల రామచంద్ర వాస్కార్ అనే వ్యక్తిని ఆమె ప్రేమించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని ఒప్పించి వివాహం చేశారు. జేజే హాస్పిటల్లో డిసెంబరు 29 వైద్యులు, పోలీసులు దగ్గరుండి అతడితో వివాహం జరిపించారు. ఆస్పత్రి సిబ్బంది జోక్యం చేసుకోకపోతే ఈ కథ సుఖాంతం అయ్యేది కాదు. అంతకు ముందు సిబ్బంది ఆమెకు కౌన్సెలింగ్ చేసి బాయ్ఫ్రెండ్ గురించి ఆరా తీయడంతో అతడి వివరాలను తెలియజేసింది.
జేజే మార్గ్ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ విషయం గురించి రామచంద్రకు తెలియజేసి మేఘాను భార్యగానూ, ఆమెకు పుట్టిన బిడ్డను తక కొడుకుగా స్వీకరించేలా ఒప్పించారు. ఇంటర్మీడియట్ చదువుకున్న మేఘాకు 2015 అక్టోబరులో రామచంద్రతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత తరచూ వీరు కలుసుకునేవాళ్లు. గత మేలో గర్బం దాల్చిన మేఘా ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా దాచిపెట్టింది.
నవంబరులో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వైద్యం కోసం జీటీ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ ఎంఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులు మెదడులో కణితి ఉన్నట్లు గుర్తించి జేజే హాస్పిటల్కు సిఫార్సు చేశారు. ఆమె వైద్యం కోసం డిసెంబరు 21 న న్యూరోసర్జరీ విభాగంలో అడ్మిట్ అయ్యింది. ఈ విషయం గురించి రామచంద్ర ముంబై మిర్రర్తో మాట్లాడుతూ తాము తరచూ కలుసుకున్నా ఈ విషయం గురించి ఒక్కసారి కూడా చెప్పలేదని అన్నాడు.
గత జూన్లో మేఘా తల్లి ఆనారోగ్యంతో మరణించినపుడు కూడా వెళ్లాను కానీ అప్పుడైనా చెప్పలేదని తెలిపాడు. చెల్లెలు గర్భం దాల్చిన విషయం తమకు కూడా తెలియకపోవడం వింతగా ఉందని ఆమె సోదరుడు అన్నాడు.