యాప్నగరం

ప్రయాణికులను కాపాడి.. ప్రాణాలొదిలిన బస్సు డ్రైవర్

గుండె పోటుకు గురైనా.. 60 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సును సురక్షితంగా ఆపిన తర్వాతే ప్రాణాలొదిలాడు ఓ డ్రైవర్.

TNN 17 Mar 2017, 1:43 pm
గుండె పోటుకు గురైనా.. 60 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సును సురక్షితంగా ఆపిన తర్వాతే ప్రాణాలొదిలాడు ఓ డ్రైవర్. ఈ హృదయ విదాకర ఘటన కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలో జరిగింది. ప్రయాణికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రోజు (మార్చి 17) ఉదయం ఒక బస్సు అమరాపూర్ నుంచి షిరాకు బయలుదేరింది. మధుగిరికి చెందిన 55 ఏళ్ల నాగరాజు బస్సు నడుపుతున్నాడు. 7 గంటల ప్రాంతంలో లక్కనహేలి సమీపంలో.. బస్సు సరిగ్గా ఒక కల్వర్టు దగ్గర ఉన్నప్పుడు.. నాగరాజుకు తీవ్రమైన ఛాతీ నొప్పి వచ్చింది. బాధను పంటిబిగువన అణచిపెట్టి, అతడు వెంటనే అప్రమత్తమై బస్సు వేగాన్ని క్రమంగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు.
Samayam Telugu a bus driver saves passengers before he dies of heart attack
ప్రయాణికులను కాపాడి.. ప్రాణాలొదిలిన బస్సు డ్రైవర్


బాధతో ఇబ్బంది పడుతున్న నాగరాజును గమనించిన కండక్టర్ వెంటనే డ్రైవర్ సీటు వద్దకు పరుగెత్తుకొచ్చి బ్రేకులు వేయడంలో అతడికి సహకరించాడు. దీంతో ఆ బస్సు కల్వర్టు చివరకు వచ్చి ఆగిపోయింది. కొంచెం ఆలస్యమైనా.. కల్వర్టు పై నుంచి పల్టీ కొట్టేదే. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులున్నారు. బస్సు ఆగిపోగానే డ్రైవర్‌ నాగరాజును కిందకి దించి హాస్పిటల్‌కు తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యంలోనే అతడు హార్ట్ ఎటాక్‌తో మరణించాడు. తాను అంత భాధలో ఉన్నా.. 60 మంది ప్రాణాలను కాపాడటానికి తపన పడిన నాగరాజు ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.