యాప్నగరం

వీడియో: పెగ్గు ఇవ్వలేదని మహిళ పచ్చిబూతులు

ఐర్లాండ్ ప్రయాణికురాలు విమాన సిబ్బందిని అభ్యంతరకరంగా తిట్టింది. విమానంలోని తోటి ప్రయాణికులు జరిగిన తతంగాన్ని వీడియో తీశారు.

Samayam Telugu 14 Nov 2018, 4:47 pm
ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ విదేశీ ప్రయాణికురాలు తాగి రచ్చరచ్చ చేసింది. మరో పెగ్ ఎందుకు ఇవ్వరంటూ విమాన సిబ్బందితో గొడవకు దిగి పచ్చి బూతులు తిట్టింది. విమానం లండన్ హిత్రూ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే విషయాన్ని చెప్పిన సిబ్బంది ఆమెను పోలీసులకు అప్పగించారు. నవంబర్ 10వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెగ్ ఇవ్వకపోయినా కిక్కు ఎక్కిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Samayam Telugu Air India foreigner passenger


ఐర్లాండ్‌కు చెందిన మహిళ ఎయిరిండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించింది. జర్నీలో మద్యం సేవించింది. ఆమె పరిస్థితి గమనించిన సిబ్బంది మరో గ్లాస్ మద్యం ఇచ్చేందుకు నిరాకరించారు. ఇక అది మొదలుకుని ఐర్లాండ్ ప్రయాణికురాలు విమాన సిబ్బందిని అభ్యంతరకరంగా తిట్టడమే కాకుండా వారిపై ఉమ్మివేసింది. విమానంలోని తోటి ప్రయాణికులు జరిగిన తతంగాన్ని వీడియో తీశారు.

సిబ్బంది ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. గ్లాస్ వైన్ నిరాకరించేందుకు మీకెంత ధైర్యమంటూ నోరు తెరిచిన ఐర్లాండ్ ప్రయాణికురాలు ఆపై పచ్చి బూతులు తిడుతూ హంగామా చేసింది. కంట్రోల్‌లో లేదని ఆమె పరిస్థితిని పైలట్‌కు వివరించగా.. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో గ్లాస్ మద్యం ఇవ్వొద్దని చెప్పారని సిబ్బంది వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.