యాప్నగరం

రూ.కోటి విలువైన భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చి పేదలకు పంచిపెట్టాడు

ఉండటానికి ఇళ్లులేక ఇబ్బందులు పడుతోన్న పేదలను చూసి ఓ పెద్దాయన మనసు చలించిపోయింది. దీంతో తన భూమిలో కొంత భాగాన్ని ఇళ్ల స్థలాలుగా మార్చి పేదలకు పంచిపెట్టారు.

Samayam Telugu 20 May 2019, 11:33 am
Samayam Telugu yanam
ఉండటానికి ఇళ్లులేక ఇబ్బందులు పడుతోన్న పేదలను చూసిన ఓ పెద్దాయన మనసు కరిగిపోయింది. దీంతో తన వంతుగా వారికి సహాయం చేయాలని భావించారు. తనకున్న భూమిలో కొంత ఇళ్ల స్థలాలుగా మార్చి పేదలకు ఇవ్వాలని నిర్ణయించారు. ఆలోచన వచ్చిందే తడువుగా రూ.కోటి విలువచేసే తన రెండెకరాల కొబ్బరి తోటను ఇళ్ల స్థలాలు మార్చి పేదలకు పంచి తన దానగుణాన్ని చాటుకున్నారు. ఇది కాకినాడ సమీపంలో కేంద్రపాలిత యానాం పరిధిలోని దరియాలతిప్పకు చెందిన మెల్లం వెంకటసుబ్బారావు దాతృత్వం.

వివరాల్లోకి వెళ్తే మెల్లం వెంకటసుబ్బారావు గతంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్నారు. తన గ్రామంలోని గూడులేక ఇబ్బందులు పడుతున్న పేదలను చూసి ఆయన మనసు చలించింది. దీంతో రూ.కోటి విలువచేసే రెండు ఎకరాల కొబ్బరితోటను ఇళ్ల స్థలాలుగా మార్చారు. ఆదివారం గ్రామపెద్దల సమక్షంలో 54 మంది పేద కుటుంబాలకు వాటిని అందజేసి గొప్ప మనుసు చాటుకున్నారు. దరియాలతిప్ప కొత్త కాలనీ వద్ద ఉన్న భూమిని దానం చేసిన సుబ్బారావుకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు ఎన్నటికీ రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆ ప్రాంతానికి మెల్లం వెంకటసుబ్బారావు కాలనీగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన గ్రామపెద్దలు దాతను అభినందనలతో ముంచెత్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.