యాప్నగరం

వీడియో: కన్నతల్లిని టెర్రస్ మీది నుంచి తోసి..

అతడో ప్రొఫెసర్, కానీ తను ఎదిగేందుకు కారణమైన తల్లిని టెర్రస్ మీది నుంచి తోసి చంపేశాడు.. ఆత్మహత్యగా చిత్రీకరించాడు.

TNN 4 Jan 2018, 4:43 pm
మనకోసం ఎన్నో త్యాగాలు చేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ తను ఎదిగేందుకు కారణమైన తల్లినే కొడుకు ఓ మేడ మీది నుంచి తోసేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో చోటు చేసుకుంది. సందీప్ అనే ప్రొఫెసర్ మూడు నెలల క్రితం తల్లిని టెర్రస్ మీది నుంచి తోసి చంపేశాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఇటీవలే అతణ్ని అరెస్ట్ చేశారు.
Samayam Telugu a young son has allegedly killed his sick mother in rajkot
వీడియో: కన్నతల్లిని టెర్రస్ మీది నుంచి తోసి..


వివరాల్లోకి వెళ్తే.. రాజ్‌కోట్‌లోని గాంధీగ్రామ్ ఏరియాలో సందీప్ అనే ప్రొఫెసర్ నివాసం ఉంటున్నాడు. అతడి తల్లి జైశ్రీబెన్ కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో సతమతం అవుతోంది. గత సెప్టెంబర్లో ఆమె సొంత ఇంటి పై నుంచి దూకి మరణించింది. దీంతో ఆత్మహత్యగా భావించిన పోలీసులు కేసును క్లోజ్ చేశారు. కానీ అది హత్య అని పేర్కొంటూ ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి రాజ్‌కోట్ పోలీసులకు లేఖ రాశాడు. అందులో సీసీటీవీ ఫుటేజీని కూడా పొందుపర్చాడు.

సందీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించగా.. ఎండలో ఉంటానంటే పైకి తీసుకెళ్లానని, తర్వాత తను ఆత్మహత్య చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ మెడికల్ రికార్డులను పరిశీలించిన పోలీసులు ఆమె నడవగలిగే స్థితిలో లేదని తేల్చారు. అలాంటిది రెండున్నర అడుగుల ఎత్తయిన గోడ మీది నుంచి ఎలా దూకగలదని గట్టిగా నిలదీశారు. దీంతో సందీప్ నిజం చెప్పాడు. తన తల్లికి చాలా కాలంగా ఒంట్లో బాగుండటం లేదని, దీంతో విసిగిపోయి తనను హతమార్చాలని నిర్ణయించినట్లు చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.