యాప్నగరం

ముంబైలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

మైనర్ బాలికను అపహరించి, ఆపై అమెను గ్యాంగ్ రేప్ చేసిన ఘటన ముంబైలోని దిందోషి పోలీస్ స్టేషన్ ఫరిధిలో చోటు చేసుకుంది.

TNN 4 Nov 2016, 11:44 am
మైనర్ బాలికను అపహరించి ఆపై ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన ముంబై దిందోషి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్లమ్ ఏరియాలో నివశించే 15 ఏళ్ల మైనర్ బాలిక అక్టోబరు 21 నుంచి కనపడుట లేదంటూ ఆమె తల్లిదండ్రులు దిందోషి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి కిడ్నాప్ కేసు నమోదు చేశారు. అయితే అయిదు రోజుల తర్వాత ఆ బాలిక ఇంటికి తిరిగొచ్చింది. తిరిగొచ్చిన తమ కుమార్తెను తల్లిదండ్రులు ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఆమె పొంతన లేని సమాధానం చెప్పడంతో వారు గట్టిగా నిలదీసి అడిగేసరికి అసలు విషయం చెప్పింది.
Samayam Telugu abducting and gangrape of minor five youths booked in mumbai
ముంబైలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్


తెలిసిన ఇద్దరు వ్యక్తులు తనను నమ్మించి మార్వే ప్రాంతానికి తీసుకెళ్లి నాపై అత్యాచారం చేశారని చెప్పింది. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి జరిగిన విషయం పోలీసులకు వివరించారు. వీరితోపాటు మరో ముగ్గురు తనపై అత్యాచారం చేశారని ఆ బాలిక పోలీసులకు తెలిపింది. వీరిలో ఒకరు ఆ బాలికతో కొన్ని నెలలుగా శారీరక సంబంధం పెట్టుకున్న వ్యక్తి కూడా ఉన్నాడు. మైనర్ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నందుకు వీరిపై రేప్ కేసు నమోదు చేసి నిదింతుల్ని అక్టోబరు 28 న అదుపులోకి తీసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. ఇందులో ఒకరు మైనర్ బాలుడు కావడంతో దోంగ్రీలోని జువైనల్ హోమ్‌కు తరలించామని, మిగతా నలుగురు నిందితులు నవంబరు 7 వరకు పోలీస్ కస్టడీలో ఉంటారని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.