యాప్నగరం

మంటల్లో బస్సు... తప్పించుకున్న ప్రయాణికులు

ఈ మధ్య ట్రావెల్స్ బస్సులు మంటల్లో చిక్కుకోవడం తరచూ జరుగుతోంది.

TNN 2 May 2017, 11:39 am
ట్రావెల్స్ బస్సులు మంటల్లో చిక్కుకోవడం తరచూ జరుగుతోంది. కర్ణాటకలోని ఇరవై రెండు మంది ప్రయాణికులు అదృష్టవశాత్తూ మంటల్లో చిక్కుకోకుండా బతికి బయటపడ్డారు. ఓ వ్యక్తి బస్సు నుంచి పొగ రాగానే చూసి అనుమానించి డ్రైవర్‌ను అలర్ట్ చేయడంతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది. కర్ణాటకలోని కొప్పల్ తాలూకాలోని హలగెరి ప్రాంతంలో బస్సు కాలి బూడిదైంది. లగ్జరీ ట్రావెల్స్ బస్సు బెంగళూరు నుంచి గడగ్ ప్రాంతానికి వెళుతోంది. అందులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. కొప్పల్ ప్రాంతం దాటి 12 కిలోమీటర్ల దూరం వచ్చాక... తెల్లవారుజామున బస్సు ఇండికేటర్ నుంచి చిన్నగా పొగలు రావడం మొదలైంది. ఆ విషయాన్ని మార్నింగ్ వాక్ వెళ్లిన వీరభద్రప్ప అనే టీచర్ చూశారు. పొగలతో పాటూ చిన్న మంట కూడా కనిపించేసరికి ఆయన గట్టిగా అరిచాడు.
Samayam Telugu ac bus burnt passengers saved by alert morning walker
మంటల్లో బస్సు... తప్పించుకున్న ప్రయాణికులు


ఆయన అరుపులకు అటుగా వెళుతున్న కొందరు గ్రామస్థులు కూడా చూసి మంటలొస్తున్నాయంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. డ్రైవర్ శివలింగప్ప ఆ అరుపులు విని వెంటనే బస్సాపి చూసేసరికి పొగలు కనిపించాయి. వెంటనే నిద్రలో ఉన్న ప్రయాణికులు అందరినీ బస్సు దిగమని లేపాడు. అంతా గబాగభా బస్సు దిగారు. మంటలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేశారు. మంటలు చల్లారకుండా మొత్తం బస్సుకు అంటుకున్నాయి. క్షణాల్లో బస్సు మొత్తం తగలబడిపోయింది. ఇదంతా కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయింది. ఆ టీచర్ చూడకపోతే... పెద్ద ప్రమాదమే వాటిల్లేది. ఆ భయానక దృశ్యం చూసి ప్రయాణికులంతా వణికిపోయారు. దేవుడి దయవల్ల బతికి బయటపడ్డామని మొక్కుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారంతా.


Read this story in Kannada:

http://vijaykarnataka.indiatimes.com/district/koppala/bus-gtuted-in-fire/articleshow/58464272.cms

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.