యాప్నగరం

రక్తపు మడుగులో వ్యక్తి.. నిలువు దోపిడీ చేసిన జనం!

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో పడివున్న వ్యక్తిని రక్షించాల్సిన జనం.. అతన్ని నిలువునా దోచుకున్నారు. ఇది జరిగింది మరెక్కడో కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో.

TNN 18 Aug 2017, 12:51 pm
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో పడివున్న వ్యక్తిని రక్షించాల్సిన జనం.. అతన్ని నిలువునా దోచుకున్నారు. ఇది జరిగింది మరెక్కడో కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో. నిత్యం రద్దీగా ఉండే ఐఎస్‌బీటీ కశ్మీరీ గేట్ వద్ద రోడ్డు దాటుతోన్న 35 ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్ర రక్తస్రావంతో సాయం కోసం ఆర్ధిస్తున్న అతని అటుగా వెళ్తున్నవారు ఎవరూ పట్టించుకోలేదు.
Samayam Telugu accident victim lies on road for help for 12 hours gets robbed of mobile rs 12
రక్తపు మడుగులో వ్యక్తి.. నిలువు దోపిడీ చేసిన జనం!


పైగా, అతడి మొబైల్ ఫోన్‌‌, బ్యాగ్‌తోపాటు అతని జేబులో ఉన్న రూ.12 కూడా దొంగిలించారు. బాధితుడు దాదాపు 12 గంటల పాటు రోడ్డుపైనే రోడ్డుపైనే పడివున్న ఎవరూ పోలీసులకు గానీ, అంబులెన్స్‌కు గానీ ఫోన్ చేయలేదు.

బాధితుడిని ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన నరేంద్ర కుమార్‌గా గుర్తించారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ ఘటన చోటు చేసుకోగా బుధవారం ఉదయం 6 గంటలకు బాధితుడిని ఆసుపత్రిలో చేర్చారు. సీసీటీవీ వీడియోల ద్వారా నరేంద్రను ఢీకొట్టిన వాహనాన్ని కనుగొంటామని పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.