యాప్నగరం

వరుస యాక్సిడెంట్లే ఆ విద్యార్థిని ‘ఉరి’గొల్పాయా?

నానో టెక్నాలజీ కోర్సును అభ్యసిస్తున్న 19 ఏళ్ల ఓ కుర్రాడు యాక్సిండెట్ల కారణంగా చదువులో వెనుకబడటంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

TNN 18 Oct 2016, 3:01 pm
నానో టెక్నాలజీ కోర్సును అభ్యసిస్తున్న 19 ఏళ్ల ఓ కుర్రాడు యాక్సిండెట్ల కారణంగా చదువులో వెనుకబడటంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరుప్పూర్ ప్రాంతానికి చెందిన పి లోగేష్ గుహాన్ చెన్నైలోని ఎస్ఆర్ఎం క్యాంపస్‌లోని హాస్టల్లో ఉండి నానో టెక్నాలజీ చదువుతున్నాడు. దసరా సెలవుల కోసం ఇంటికెళ్లి శనివారం సాయంత్రమే హాస్టల్‌కు తిరిగొచ్చాడు. ఆదివారం నాడు సీలింగ్‌కు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. సోమవారం ఊరి నుంచి తిరిగొచ్చిన అతడి రూమ్మేట్ విజయ భాస్కర్.. గది నుంచి దుర్వాసన రావడాన్ని గమనించాడు. డోర్ లోపలి నుంచి లాక్ చేసి ఉండటంతో, తలుపు తట్టాడు. కానీ ఎలాంటి స్పందనా లేకపోవడంతో హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించాడు. అతడు వెంటిలేటర్ నుంచి తొంగి చూడగా.. గుహన్ సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో వార్డెన్ పోలీసులకు సమాచారం అందించాడు. వారొచ్చి తలుపులు బద్దలు కొట్టి బాడీని స్వాధీనం చేసుకొని అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్నారు.
Samayam Telugu after 2 accidents chennai student hangs himself
వరుస యాక్సిడెంట్లే ఆ విద్యార్థిని ‘ఉరి’గొల్పాయా?

2015-16లో కోర్సులో చేరిన గుహాన్‌ గత సంవత్సరం యాక్సిండెంట్ బారిన పడ్డాడు. దీంతో అతడు మధ్యలోనే డిస్‌కంటిన్యూ అయ్యాడు. దాదాపు ఏడాదిలో సగం రోజులు తరగతులకు హాజరు కాలేకపోయాడు. దీంతో కాలేజీ యాజమాన్యం అతణ్ని సస్పెండ్ చేసి, తిరిగి ఈ ఏడాది కూడా మొదటి సంవత్సరంలోనే కూర్చోబెట్టింది. మళ్లీ చదువు బాట పట్టినంతలోనే మరోసారి యాక్సిడెంట్ కావడంతో అతడి కాలికి గాయమైంది. ఈ కారణంగానే అతడు సూసైడ్ చేసుకొని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.