యాప్నగరం

మరో పాక్ పావురం వచ్చి వాలింది

పాకిస్థాన్ నుంచి వస్తున్న పావురం లేఖలు పెరిగిపోతున్నాయి.

TNN 7 Oct 2016, 3:07 pm
పాకిస్థాన్ నుంచి వస్తున్న పావురం లేఖలు పెరిగిపోతున్నాయి. మరో పావురం పాక్ సరిహద్దు నుంచి అనుమానాస్పదంగా వచ్చి వాలింది. ఆ పావురం రెక్కలపై ఉర్దూలో రాతలున్నాయి. తోకపై ఓ ఫోన్ నెంబర్ రాసి ఉంది. ఈ పావురం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ దగ్గర్లోని అంజల గ్రామంలో కనిపించింది. పవన్ కుమార్ అనే వ్యక్తి తన దుకాణంపై దానిని గుర్తించాడు. వెంటనే ఆ పావురాన్ని పట్టుకుని ఆర్మీ అధికారులకు సమాచారం అందించాడు. గత ఆదివారం కూడా ఓ పావురం కాలికి లేఖ కట్టి పాక్ సరిహద్దు నుంచి భారత్ భూభాగంలోకి వదిలారు. ఆ లేఖలో మోడీనుద్దేశించి పాక్ యువకులు తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు రాశారు. మరో రోజు ఉర్దూ రాతలతో బెలూన్లను వదిలారు.
Samayam Telugu another pigeon lands in india cmae from pakisthan
మరో పాక్ పావురం వచ్చి వాలింది


తాజాగా అంజలా ప్రాంతంలో వాలిన పావురాన్ని ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై అంజలా ఇన్ స్పెక్టర్ మాట్లాడుతూ... భారత్, పాక్ సరిహద్దు ప్రజలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పావురాలను ఎగరేయడం అలవాటుగా ఉందని చెప్పారు. అయితే ఇలా రాతలతో పావురాలు రావడం చాలా అరుదని తెలిపారు. భారత్ పాక్ లో సర్జికల్ స్ట్రెక్స్ చేసినప్పటి నుంచి ఇలాంటి పావురాలు రావడం మొదలయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.