యాప్నగరం

ఎవరెస్ట్ అధిరోహణలో భారతీయురాలి వరల్డ్ రికార్డ్

వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు ఎవరెస్టు శిఖరాగ్రాన్ని చేరిన అన్షు జంసెంప ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

TNN 21 May 2017, 1:10 pm
ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని నాలుగుసార్లు అధిరోహించిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పిన అన్షు జంసెంప మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. గత మంగళవారం ఎవరెస్టు ఎక్కిన ఆమె.. ఐదు రోజుల వ్యవధిలోనే మరోసారి ఎవరెస్టు శిఖరాన్ని పాదాక్రాంతం చేసుకున్నారు. దీంతో ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు ఈ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళగా అన్షు రికార్డు నెలకొల్పారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఆమె ఎవరెస్టు శిఖరాగ్రానికి చేరుకున్నారు.
Samayam Telugu anshu jamsenpa tops everest twice in week breaks world record
ఎవరెస్ట్ అధిరోహణలో భారతీయురాలి వరల్డ్ రికార్డ్


అరుణాచల్ ప్రదేశ్‌లోని బొమ్డిలా పట్టణానికి చెందిన అన్షు 2011లో రెండుస్లారు విజయవంతంగా ఎవరెస్టు ఎక్కారు. రెండేళ్ల విరామం తర్వాత ఆమె మూడోసారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. 2014లో మరోసారి ఎవరెస్టు ఎక్కేందుకు ఆమె ప్రయత్నించారు. కానీ అదే సమయంలో భూకంపం కారణంగా 18 మంది పర్వతారోహకులు బేస్ క్యాంప్ వద్ద మరణించడంతో ఆమె వెనుదిరిగారు.

నేపాల్‌కు చెందిన లక్పా షెప్రా అనే మహిళ ఇప్పటి వరకూ ఎనిమిది సార్లు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. అత్యధికసార్లు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.