యాప్నగరం

గుండెలు పిండేస్తోన్న జవాన్ చివరి మాటలు

ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న ఆర్మీ అధికారి చివరిసారిగా తన భార్యకు ఫోన్‌‌లో చెప్పిన మాటలు అందరి హృద‌యాల‌ను ధ్రువించేస్తున్నాయి.

TNN 11 Oct 2017, 12:23 pm
ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్న ఆర్మీ అధికారి చివరిసారిగా తన భార్యకు ఫోన్‌‌లో చెప్పిన మాటలు అందరి హృద‌యాల‌ను ధ్రువించేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ కు చెందిన రాజ్‌కుమార్ ఆర్మీ‌లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా ఉత్తర కశ్మీర్‌లోని బడ్గాం జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం కర్వాచౌత్ పర్వదినాన్ని పురస్కరించుకుని, రాజ్‌కుమార్ భార్య దేవి ఉపవాసంతో పూజలు చేసింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఉగ్రదాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అంతిమ ఘడియల్లో ఉన్న కుమార్ తన భార్యకు ఫోన్ చేసి... ‘నువ్వు ఉపవాసం విరమించి ఏదన్నా తీసుకో. నేను డ్యూటీకి వెళుతున్నాను. ఉదయం మాట్లాడతాను’ అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు.
Samayam Telugu army officer killed in encounter in jammu and kashmirs budgam
గుండెలు పిండేస్తోన్న జవాన్ చివరి మాటలు


సోమవారం ఉదయం ఉగ్రవాదుల కాల్పుల్లో కుమార్ మృతిచెందినట్టు ఉన్నతాధికారులు ఆమెకు సమాచారం అందించారు. నిన్న ఆయన భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చివరిసారిగా తనతో అన్న మాటలను గుర్తు చేసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. బడ్గాం జిల్లా బీర్వాలోని డ్రాంగ్ ప్రాంతంలో రాత్రిపూట గస్తీదళంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో సుబేదార్ రాజ్‌కుమార్ మరణించినట్లు ఆర్మీ పేర్కొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.