యాప్నగరం

పిల్లల్ని చంపుతానంటూ వివాహితపై అత్యాచారం

పిల్లల్ని చంపుతానని బెదరించి ఓ వివాహితపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.

TNN 22 Jan 2017, 10:33 am
పిల్లల్ని చంపుతానని బెదరించి ఓ వివాహితపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని కలబుర్గిలో చోటు చేసుకుంది. కలబుర్గికి చెందిన శరణప్ప బేడజర్గి అనే ఆటో డ్రైవరు పిల్లల్ని ఆటోతో ఢీకొట్టి చంపుతానంటూ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయంపై కలబుర్గి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu auto driver rapes married woman in kalburgi
పిల్లల్ని చంపుతానంటూ వివాహితపై అత్యాచారం


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధిత మహిళ భర్త, తన ఇద్దరి పిల్లలతో కలిసి కలబుర్గి శివారు ప్రాంతంలోని తాజ్‌ సుల్తాన్‌పురలో నివాసం ఉంటోంది. ఆ మహిళ ఇంటింటికి తిరిగి వస్త్రాల వ్యాపారం నిర్వహిస్తుంది. రోజూ వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చేటప్పుడు శరణప్ప ఆటోలో ఎక్కువ సార్లు ఎక్కేది. ఈ పరిచయంతో ఆమె మొబైల్ నెంబరు తీసుకున్న నిందితుడు అప్పుడప్పుడూ ఆమెకు ఫోన్‌ చేసేవాడు.

బాధితురాలి వ్యక్తిగత వివరాలను, ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్న నిందితుడు ఆమె వేధించడం మొదలు పెట్టాడు. తన కోర్కేను తీర్చమంటూ ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. పరువు పోతుందని ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకపోవడంతో అతను మరింత రెచ్చిపోయాడు. తన కోర్కెను తీర్చకపోతే చంపుతానని బెదిరించి శుక్రవారం రాత్రి ఆమెను ఇంటి నుంచి బయటకు రప్పించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు శనివారం ఉదయం ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలిని, నిందితుడ్ని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.