ఉత్తరప్రదేశ్ వివాదాస్పదనేత ఆజాంఖాన్ మరోమారు కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఉత్తరప్రదేశ్ బ్రిడ్జి కార్పోరేషన్లో పనిచేసే ఇంజినీరుపై ఆగ్రహం తెచ్చుకున్న చెంపపై లాగిపెట్టి ఒకటిచ్చాడు. తన నియోజకవర్గం రాంపూర్లో నిర్మిస్తున్న ఒక ఫ్లైఓవర్ పనులు ఎలా సాగుతున్నాయో తెలుసుకునేందుకు ఆజాంఖాన్ వెళ్లారు. తన అనుచరులతో అక్కడికి చేరుకున్న ఆజాంఖాన్ కు ఫ్లై ఓవర్ నిర్మాణపనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీరు ఒకరు పనులు జరుగుతున్న తీరును వివరించారు. కానీ, ఆజాంఖాన్ కు ఆ పనుల్లో నాణ్యత కొరవడినట్లు అనిపించింది. ఇదే ప్రశ్నను అడగగా ఆ ఇంజినీర్ ఇచ్చిన సమాధానం ఆయనకు సంతృప్తినివ్వలేదు. దాంతో ఆయనలో ఆగ్రహం కట్టలుతెచ్చుకుంది. వెంటనే ఆ ఇంజినీరు చెంప పగులకొట్టారు. వెంటనే ఆయన అనుచరులు జోక్యం చేసుకుని ఆయనను నిమ్మలింపచేసారు. కాగా, ఈ ఘటనపై ఇంజినీర్ల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులను బహిష్కరిస్తామని హెచ్చరించింది. గతంలో కూడా ఆజాంఖాన్ ఎడాపెడా ఇతరులపై చేతులు ఆడించిన సంఘటనలున్నాయి.
మళ్లీ చెంపపై లాగి ఒక్కటిచ్చిన నేత
ఉత్తరప్రదేశ్ వివాదాస్పదనేత ఆజాంఖాన్ మరోమారు కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు.
TNN 1 Jul 2016, 6:41 pm