యాప్నగరం

26/11 దాడుల్లో కన్నవాళ్లను కోల్పోయిన ఇజ్రాయెల్ బాలుడు మళ్లీ ముంబైకి..

26/11 ముంబై దాడుల్లో తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఇజ్రాయెల్‌ బాలుడు మోషే హోల్జ్‌బెర్గ్‌ తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ముంబైకి వచ్చాడు. ప్రస్తుతం అతడి వయసు 11 ఏళ్లు.

TNN 17 Jan 2018, 10:19 pm
26/11 ముంబై దాడుల్లో తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఇజ్రాయెల్‌ బాలుడు మోషే హోల్జ్‌బెర్గ్‌ తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ముంబైకి వచ్చాడు. ప్రస్తుతం అతడి వయసు 11 ఏళ్లు. తాతయ్య షిమోన్‌ రోజెన్‌బెర్గ్‌తో కలిసి మంగళవారం (జనవరి 16) అతడు నగరాన్ని సందర్శించాడు. తన అమ్మానాన్నలు ప్రాణాలు కోల్పోయిన నారీమన్‌ హౌస్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడికి యూదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాటి ఘటనను తలచుకొని కన్నీటిపర్యంతమయ్యారు.
Samayam Telugu baby moshe arrives at taj mahal hotel after 9 years
26/11 దాడుల్లో కన్నవాళ్లను కోల్పోయిన ఇజ్రాయెల్ బాలుడు మళ్లీ ముంబైకి..


గత జులైలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌కు వెళ్లినప్పుడు.. మోషేతోపాటు అతడి తాతయ్య, అమ్మమ్మను కలిశారు. భారతీయులు తమ భాదను గుర్తు పెట్టుకున్నందుకు ధన్యవాదాలు తెలిపిన ఆ వృద్ధ దంపతులు.. మోషే మళ్లీ ఇండియాకు రావడానికి ఆసక్తి కనబరుస్తున్నాడని, తన 13వ ఏట అతడు తప్పకుండా ఇండియాకు వస్తాడని తెలిపారు.

ఉగ్రదాడుల సమయంలో మోషే తల్లిదండ్రుల ద‌గ్గర ప‌నిచేస్తున్న సాండ్రా సామ్యూల్ అనే మ‌హిళ ఆ చిన్నారిని ప్రాణాల‌కు తెగించి కాపాడింది. ఆ త‌ర్వాత మోషేను అతడి గ్రాండ్ పేరెంట్స్ ద‌గ్గరకి తీసుకెళ్లింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.