యాప్నగరం

ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా ఆయన ఇంటికే..

మన బ్యాంకు అధికారులు శ్రీనివాసుడి భక్తుడి సేవలో తరించారు. ప్రజలకు చేరాల్సిన కొత్త నోట్లను శేఖరుడి చెంతకు చేర్చారు.

TNN 15 Dec 2016, 12:01 pm
టీటీడీ పాలకమండలి సభ్యుడిగా వైభవం వెలగబెట్టిన శేఖర్ రెడ్డి నివాసంలో భారీగా నగదు, బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని ఆయన నివాసంతోపాటు, ఆయన సంబంధీకుల ఇళ్లపై ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ.160 కోట్లకు పైగా నగదు, 179 కిలోల బంగారం బయటపడింది. అందులో రూ.34 కోట్ల విలువైన కొత్త నోట్లు ఉండటం ఐటీ అధికారులు సహా మీడియాకు విస్మయాన్ని కలిగించింది. ఈ విషయంలో తీగ లాగిన ఆదాయపన్ను విభాగానికి ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు తెలుస్తున్నాయి. రిజర్వ్ బ్యాంకు ప్రింటింగ్ ప్రెస్ నుంచి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు రావాల్సిన నగదు నేరుగా శేఖర్ రెడ్డి నివాసానికి తరలివెళ్లినట్లు తెలుస్తోంది. కరెన్సీపై ఉన్న సిరీస్ నంబర్ ఆధారంగా ఐటీ అధికారులు ఈ విషయమై నిర్ధారణకు వచ్చారు.
Samayam Telugu bankers sent money directly from printing press to sekhar reddy house
ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా ఆయన ఇంటికే..


చెన్నైలోని శేఖర్ రెడ్డికి ఇంత భారీ మొత్తంలో నగదు చేరవేయడంలో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకు అధికారుల ‘కష్టం’ కూడా ఉందట. వారి సాయంతోనే బ్యాంకుల ద్వారా సామాన్యుల చెంతకు చేరాల్సిన నగదు భారీ మొత్తంలో శ్రీనివాసుడి భక్తుడి చెంతకు తరలింది. తెలుగు రాష్ట్రాల్లోని పదిమంది బ్యాంకు అధికారుల ప్రమేయంతోనే ఇలా జరిగిందని చెబుతున్న ఐటీ అధికారులు.. ఇప్పుడు వారిని అరెస్ట్ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. అసలైతే.. ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఆర్‌బీఐకి, అక్కడి నుంచి బ్యాంకులకు నగదు పంపిణీ జరుగుతుంది. కానీ ప్రజలకు డబ్బును త్వరగా అందజేయాలనే యోచనతో ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా ప్రత్యేక బ్రాంచ్‌లకు కొత్త నోట్లను పంపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖ నగరాల్లో ఇలాంటి ప్రత్యేక బ్రాంచ్‌లున్నాయి. వాటి నుంచే శ్రీనివాసుడి భక్తుడి నివాసానికి లక్ష్మీదేవి తరలివెళ్లింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.