కోడిని దొంగిలించాడనే అనుమానంతో దాడి.. ఒకరు మృతి!
కోడి కోసం ఒకరి ప్రాణాలు బలితీసుకున్నారు. కోడిని దొంగిలించాడనే అనుమానంతో ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని అంచల్లో చోటుచేసుకుంది.
Samayam Telugu 19 Jul 2018, 12:42 pm
కోడి కోసం ఒకరి ప్రాణాలు బలితీసుకున్నారు. కోడిని దొంగిలించాడనే అనుమానంతో ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని అంచల్లో చోటుచేసుకుంది. పశ్చిమ్ బెంగాల్కు చెందిన మానిక్ రాయ్ (34) కొన్నేళ్ల కిందట ఉపాధి కోసం కేరళలోని అంచల్కు వచ్చి, అక్కడే ఉంటున్నాడు. గత నెల 24 న మానిక్ ఓ కోడిని కొనుగోలు చేసి ఇంటికి వెళ్తుండగా దానిని దొంగతం అతడు చేశాడని ఆరోపిస్తూ కొందరు ఉన్మాదులు దాడిచేశారు. వారి దాడితో భయపడిన మానిక్ రక్షించమని పెద్దగా కేకలు వేశాడు. ఇంతలో ఆ కోడిపెట్టను అమ్మిన వ్యక్తి వచ్చి, తానే అతడికి అమ్మానని చెప్పిన వారు వినిపించుకోలేదు. బాధితుడిని రక్తం వచ్చేటట్టు తీవ్రంగా కొట్టారు.
చివరకు కోడిపెట్టను అమ్మిన వ్యక్తి వారిని వారించి మానిక్ను రక్షించాడు. అప్పటికే అతడి తీవ్రంగా గాయపడటంతో వైద్యం కోసం సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. దాదాపు 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయాడు. ఆరోగ్యం విషమించడంతో అతడిని మెరుగైన వైద్యం కోసం జులై 13 న మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. తల వెనుక బలంగా దెబ్బలు తగలడంతో రాయ్ చనిపోయినట్టు సోమవారం విడుదలైన వైద్య నివేదికలో స్పష్టంమైంది. దీంతో ఈ ఉన్మాదానికి పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
Read This Story in Malayalam
చివరకు కోడిపెట్టను అమ్మిన వ్యక్తి వారిని వారించి మానిక్ను రక్షించాడు. అప్పటికే అతడి తీవ్రంగా గాయపడటంతో వైద్యం కోసం సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. దాదాపు 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయాడు. ఆరోగ్యం విషమించడంతో అతడిని మెరుగైన వైద్యం కోసం జులై 13 న మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. తల వెనుక బలంగా దెబ్బలు తగలడంతో రాయ్ చనిపోయినట్టు సోమవారం విడుదలైన వైద్య నివేదికలో స్పష్టంమైంది. దీంతో ఈ ఉన్మాదానికి పాల్పడిన ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
Read This Story in Malayalam