యాప్నగరం

స్నేహితులతో కలిసి భార్యపై గ్యాంగ్ రేప్

కట్టుకున్నవాడే భార్యపై స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏకంతంగా మాట్లాడటానికి ఇంట్లో అందరూ ఉన్నారని చెప్పి నిర్జర ప్రదేశానికి తీసుకెళ్లి స్నేహితులకు అప్పగించాడు.

TNN 18 Jun 2017, 12:27 pm
కట్టుకున్నవాడే తన స్నేహితులతో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. భారతీనగర్ ఠాణా శివాజీనగర్‌లోని బేంబూబజార్ ప్రాంతంలో దంపతులు నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య కొన్ని రోజులుగా పలు విభేదాలున్నాయి. అయితే రంజాన్ సందర్భంగా కఠిన ఉపవాసం ఆచరిస్తున్న 35 ఏళ్ల మహిళపై ఆమె భర్త ఈ నెల 11న తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారని, మాట్లాడాలన్న సాకుతో తన భర్త బయటకు తీసుకెళ్లాడని ఆమె పేర్కొంది. తనను ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లడంతో మాట్లాడేందుకే తీసుకొచ్చాడని భావించానని బాధితురాలు తెలిపింది. అయితే అప్పటికే అక్కడ అతని స్నేహితులు ఉన్నారని, వారంతా కలిసి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు వాపోయింది.
Samayam Telugu bengaluru women gangraped by her husband and his friends
స్నేహితులతో కలిసి భార్యపై గ్యాంగ్ రేప్


తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని ఇరుగుపొరుగు వారు వైద్యం కోసం బౌరింగ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. రంజాన్‌ మాసం సందర్భంగా ఆమె రోజా (ఉపవాసం) ఉంటోన్న బాధితురాలిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణానికి తనలోనే తానే కుమిలిపోతున్న బాధితురాలికి తల్లిదండ్రులు, బంధువులు ధైర్యం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంజాన్ ముగిసిన అనంతరం అతడిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని పేర్కొంది. వైద్య నివేదిక అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ ఘటనపై పైరవీలు ప్రారభమైనట్టు మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఈ విషయాన్ని బయటకు రాకుండా నిందితుడు ప్రయత్నాలు ప్రారంభించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.