వేగంగా పరుగెడుతున్న రైలుకు వేలాడుతూ ఓ యువకుడు అదుపుతప్పి పడిపోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ప్రమాదంలో 26 ఏళ్ల ఆ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. గురువారం (జులై 12) జరిగిన ఈ ఘటన తాలూకు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నాందేడ్ - బెంగళూరు ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు వేగంగా కదులుతుండగా సదరు యువకుడు చాలా దూరం పాటు దాని కిటికీకి వేలాడుతూ ప్రయాణించాడు. అనంతరం పట్టు కోల్పోయి కిందపడిపోయాడు.
అదృష్టవశాత్తూ రైలుకు దూరంగా పడిపోవడంతో యువకుడి ప్రాణాలు నిలిచాయి. కానీ, రైలు వేగంగా ప్రయాణిస్తున్న కారణంగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. కదులుతున్న రైలును అందుకునే క్రమంలో ఆ యువకుడు ఇలా ప్రమాదానికి గురయ్యాడా? లేదా కావాలనే ఇలాంటి సాహసానికి తెగించాడా అనే వివరాలు తెలియాల్సి ఉంది..
యువకుడు రైలుకు వేలాడుతున్న దృశ్యాలను రైలులో ఉన్న కొంత మంది తమ సెల్ ఫోన్లలో బంధించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది. అయితే.. వీడియో తీయడానికి అంతగా ఉత్సాహం చూపిన ఆ వ్యక్తులు చైన్ లాగి రైలును ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదనేది ఈ ఘటనలో మరో సందేహాస్పద అంశం. ఏదేమైనా ఆ యువకుడు ప్రాణాలతో బయటపడటం ఊరటనిచ్చే అంశం. ఒళ్లు గగుర్పొడిచే ఆ దృశ్యాలను మీరూ చూడండి..
అదృష్టవశాత్తూ రైలుకు దూరంగా పడిపోవడంతో యువకుడి ప్రాణాలు నిలిచాయి. కానీ, రైలు వేగంగా ప్రయాణిస్తున్న కారణంగా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే.. కదులుతున్న రైలును అందుకునే క్రమంలో ఆ యువకుడు ఇలా ప్రమాదానికి గురయ్యాడా? లేదా కావాలనే ఇలాంటి సాహసానికి తెగించాడా అనే వివరాలు తెలియాల్సి ఉంది..
యువకుడు రైలుకు వేలాడుతున్న దృశ్యాలను రైలులో ఉన్న కొంత మంది తమ సెల్ ఫోన్లలో బంధించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది. అయితే.. వీడియో తీయడానికి అంతగా ఉత్సాహం చూపిన ఆ వ్యక్తులు చైన్ లాగి రైలును ఆపే ప్రయత్నం ఎందుకు చేయలేదనేది ఈ ఘటనలో మరో సందేహాస్పద అంశం. ఏదేమైనా ఆ యువకుడు ప్రాణాలతో బయటపడటం ఊరటనిచ్చే అంశం. ఒళ్లు గగుర్పొడిచే ఆ దృశ్యాలను మీరూ చూడండి..