యాప్నగరం

ఎయిర్ చైనాకు ఎంత పొగరు...!

చైనా దేశం భారత్ విషయంలో చాలా హద్దులు దాటి ప్రవర్తిస్తోంది.

TNN 8 Sep 2016, 12:52 pm
చైనా దేశం భారత్ విషయంలో చాలా హద్దులు దాటి ప్రవర్తిస్తోంది. ఆ దేశ విమానయాన సంస్థ అయిన ‘ఎయిర్ చైనా’ జాత్యాంహకార వ్యాఖ్యలతో భారత ప్రవాసులను అవమానించింది. ఈ విషయాన్ని చైనాకు చెందిన ఓ జర్నలిస్టు వెలుగులోకి తెచ్చింది. పూర్తి వివరాల ప్రకారం... ఎయిర్ చైనా చాలా సిటీలతో పాటూ లండన్ కు విమానాలు నడుపుతోంది. లండన్ వెళ్లే తమ ప్రయాణికులకు ఓ మ్యాగజీన్ ను అందుబాటులో ఉంచింది. అందులో ‘లండన్ చాలా సురక్షిత ప్రాంతం... కానీ భారతీయులు, పాకిస్తానీలు, నల్లజాతి మనుషులు ఉన్న ప్రాంతాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలు మానుకోండి. మహిళలు ఒంటరిగా తిరగకుండా తోడుగా ఎవరినో ఒకరిని పెట్టుకోండి’ అని రాసి ఉంది. ఆ కాపీని చైనా జర్నలిస్టు అయిన హేజ్ ఫ్యాన్ ట్విట్టర్ లో పెట్టింది. ఆ ట్వీట్ ను మేయర్ ఆఫ్ లండన్ ను ట్యాగ్ చేసింది. ఆమె ఎయిర్ చైనా చేసిన ఈ ప్రకటనపై తన అభిప్రాయాన్ని మీడియాకు రాసింది. లండన్ మేయర్ పేరు సాధిక్ ఖాన్. అతను పాకిస్తానీ అమ్మనాన్నలకు పుట్టిన బ్రిటిషర్. ఆయన జులైలో లండన్ ఈజ్ ఓపెన్ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. లండన్ అందరినీ ఆహ్వానిస్తుంది అన్నది ఆ ప్రచార ఉద్దేశం. ఆ ప్రచారాన్ని నీరుగార్చేలా ఎయిర్ చైనా ప్రవర్తించిందని హేజ్ ఫేన్ పేర్కొంది. గతంలోనూ జాతివివక్షను చూపేలా ఓ చైనా కంపెనీ డిటర్జంట్ ప్రకటనను ప్రసారం చేయడాన్ని ఆమె ప్రస్తావించింది. ఓ ఆసియా మహిళ నల్లగా ఉన్న వ్యక్తిని వాషింగ్ మెషీన్‌లో వేసి, అతడిని తెల్లటి, శుభ్రంగా ఉన్న ఆసియా వ్యక్తిగా బయటికి తీసినట్టు ప్రకటనలో చూపించారు. దీనిపై అప్పట్లో విమర్శులు రేగి... సదరు చైనా కంపెనీ క్షమాపణలు చెప్పింది.
Samayam Telugu beware of populated areas with indians pakistanis black people says airchina
ఎయిర్ చైనాకు ఎంత పొగరు...!


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.