యాప్నగరం

విద్యార్థినిపై ప్రిన్సిపాల్, ముగ్గురు టీచర్ల గ్యాంగ్ రేప్

బిహార్లో దారుణం చోటుచేసుకుంది. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తులే కీచకుల్లా వ్యవహరించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే..

TNN 16 Jan 2017, 7:28 pm
బిహార్లో దారుణం చోటుచేసుకుంది. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తులే కీచకుల్లా వ్యవహరించారు. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే పశువు కంటే దారుణంగా ప్రవర్తించారు. 12 ఏళ్ల బాలికను స్కూల్ ప్రిన్సిపాల్‌తోపాటు ముగ్గురు టీచర్లు గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉన్న ఉపాధ్యాయులే ఇంత అమానవీయంగా, మృగాళ్లలా వ్యవహరించిన ఘటన జెహనాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
Samayam Telugu bihar school principal and 3 teachers gangrape 12 year old girl student
విద్యార్థినిపై ప్రిన్సిపాల్, ముగ్గురు టీచర్ల గ్యాంగ్ రేప్


అజు అహ్మద్ అనే వ్యక్తి కాకో సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నాడు. అతుల్ రహమాన్, అబ్దుల్ బరీ, మహ్మద్ షకౌత్‌లు ఆ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. ఆదివారం సదరు బాలిక పాఠశాల భవనంలో ఒంటరిగా ఉన్న సమయంలో వీరు ముగ్గురూ ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. స్కూల్ బిల్డింగ్ పైకి తీసుకెళ్లిన వీరు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పీకే శ్రీవాస్తవ తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

స్కూల్ భవనం పైన తన కుమార్తెతోపాటు.. ఉపాధ్యాయుడొకరు అసభ్యకర రీతిలో పడుకొని ఉన్న విషయాన్ని గమనించిన ఆమె తల్లి ఈ విషయమై కూతుర్ని ఆరా తీసింది. జరిగిన విషయం తెలుసుకొని పోలీసులను ఆశ్రయించింది. ఆదివారం పాఠశాలకు సెలవు దినం కాగా.. శుక్రవారం సెలవు ఇవ్వడంతో ఆదివారం పాఠశాలకు రావాలని ప్రిన్సిపాల్ ఆదేశించినట్లు శ్రీవాస్తవ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.