యాప్నగరం

స్మార్ట్‌ ఫోన్ కొనలేదని మైనర్ ఆత్మహత్య!

ఆండ్రాయిడ్ మొబైల్ కొని ఇవ్వలేదని ఓ బాలుడు పాఠశాల సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

TNN 19 Jan 2017, 1:39 pm
ఆండ్రాయిడ్ మొబైల్ కొని ఇవ్వలేదని ఓ బాలుడు పాఠశాల సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా రాయ్‌కల్ మండలం ఇకిత్యాల గ్రామానికి చెందిన పద్నాలుగేళ్ల పి. లింగమూర్తి కొన్నేళ్ల కిందటే తల్లిదండ్రులను కోల్పోయాడు. తల్లిదండ్రుల చనిపోయిన తర్వాత అనాథగా మారిన లింగమూర్తిని బంధువైన లక్ష్మీ చేరదీసింది.
Samayam Telugu boy hangs self as poor mother cant buy mobile
స్మార్ట్‌ ఫోన్ కొనలేదని మైనర్ ఆత్మహత్య!


లింగమూర్తిని పెంచుకుంటున్న లక్ష్మీకి భర్త కూడా లేడని, నిరుపేద కావడంతో కూలి పనులు చేసుకుంటూ అతడిని పోషిస్తుందని రాయకల్ ఎస్‌ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. తనకు ఆండ్రాయిడ్ మొబైల్ కావాలంటూ కొద్ది రోజులుగా అడుగుతున్నాడని, అయితే దాన్ని కొనే స్థోమత తనకు లేదని చెప్పానని లక్ష్మీ తెలిపింది. దీనిపై ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని ఆమె పేర్కొంది. గొడవ తర్వాత లింగమూర్తి మంగళవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి తిరిగి రాలేదని ఎస్ఐ తెలిపారు. అదే రోజు రాత్రే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ఆయన అన్నారు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.